రెండు క్రేజీ ప్రాజెక్స్‌లోనూ త‌క్కువ పాట‌లే..

  • IndiaGlitz, [Saturday,September 21 2019]

ప్ర‌స్తుతం టాలీవుడ్ బిగ్‌స్టార్స్ సినిమాలు ప్యాన్ ఇండియా చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఒక‌ప్పుడు స్టార్ సినిమాలంటే ఆరు పాట‌లుండాల్సిందే అన్న‌ట్లు ఉండేవి. కానీ ఇప్పుడు పెరుగుతున్న మార్కెట్ ప‌రిధి, యూనివ‌ర్స‌ల్ అప్పీల్ కార‌ణంగా క‌థాగ‌మ‌నానికి పాట‌లు అడ్డుగా అనిపిస్తే పాట‌ల‌ను కూడా తొల‌గిస్తున్నారు. లేటెస్ట్‌గా టాలీవుడ్‌లో రూపొందుతోన్న రెండు ప్రెస్టీజియ‌స్ ప్యాన్ ఇండియా మూవీస్‌లో మూడు పాట‌లుండ‌టం అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నాయి.

చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న హిస్టారిక‌ల్ మూవీ 'సైరా న‌ర‌సింహారెడ్డి'. ఈ చిత్రంలో మూడు పాట‌లు మాత్ర‌మే ఉంటాయట‌. అందులో ఒక‌టి టైటిల్ సాంగ్ కాగా.. మరో సాంగ్ డ్ర‌మ్ సాంగ్‌.. మ‌రో సాంగ్ ప్ర‌ణ‌య గీతం. టైటిల్ సాంగ్ టైటిల్స్ ప‌డేట‌ప్పుడే వ‌చ్చేస్తుంది కాబ‌ట్టి సినిమాలో రెండు సాంగ్స్ మాత్ర‌మే ఉండ‌బోతున్న‌ట్లేగా.

అలాగే మ‌రో ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ 'RRR' విష‌యానికి వ‌స్తే బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్ ఇది. అంద‌రి అంచనాలు ఈ సినిమాపై భారీగానే నెల‌కొన్నాయి. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ హీరోలుగా న‌టిస్తున్నారు. రూ.300 కోట్ల ప్రాజెక్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలోనూ మూడు సాంగ్స్ ఉంటాయి. మ‌రో సాంగ్ బ్యాగ్రౌండ్ సాంగ్ ఉంటుంది. క్ర‌మంగా రాను రాను.. స్టార్ హీరోల సినిమాల్లో పాట‌ల సంఖ్య త‌గ్గుతూ వ‌స్తుంది.