గోపీచంద్ స‌ర‌స‌న ‘ఫిదా’ బ్యూటీ

  • IndiaGlitz, [Saturday,January 09 2021]

గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో యువీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్స్‌పై ఓ సినిమాను చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్ర‌క‌టించారు. మారుతి త‌న‌దైన స్టైల్లో ఈ సినిమాను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఎంట‌ర్‌టైనింగ్ పంథాలో సాగ‌నున్న ఈ చిత్రానికి ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉన్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో గోపీచంద్ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. మార్చి నుండి సినిమాను సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. వీలైనంత త్వరగానే సినిమాను పూర్తి చేసి ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

అందులో భాగంగా గోపీచంద్ స‌ర‌స‌న సాయిప‌ల్ల‌విని హీరోయిన్‌గా న‌టింప చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. ప్ర‌స్తుతం సాయిప‌ల్ల‌వి ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ల‌యాళ రీమేక్ ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్’తో పాటు చిరంజీవి ‘వేదాళం’ రీమేక్‌లో న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రో వైపు రానా హీరోగా చేస్తున్న ‘విరాట‌ప‌ర్వం’లోనూ, నాని, రాహుల్ సంక్రిత్యాన్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ‘శ్యామ్ సింగ‌రాయ్’ సినిమాలోనూ సాయిప‌ల్ల‌వి న‌టిస్తుంది.

More News

‘క్రాక్’ మ‌ల్టీప్లెక్స్ షో వాయిదా.. కారణమదే..!

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం క్రాక్.

కొత్త పాలసీ వారికి మాత్రమే..: క్లారిటీ ఇచ్చిన వాట్సప్..

దేశవ్యాప్తంగా వాట్సప్ ప్రైవసీ రూల్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా ఇదే అంశం ట్రెండింగ్‌లో ఉంది.

మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తున్నారు?: భూమా మౌనిక

మాజీ మంత్రి అఖిల ప్రియ కిడ్నాప్ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. అయితే తాజాగా అఖిల ప్రియ సోదరి మౌనిక మీడియాతో మాట్లాడుతూ..

గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ..

ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్‌ను అందించింది. గృహ కొనుగోలు దారులకు సంక్రాంతికి ముందే పండుగ కానుకను అందించింది.

పుట్టింట్లో మరోమారు కల్లోలం రేపుతున్న కరోనా మహమ్మారి..

కరోనా మహమ్మారి తన పుట్టింట్లో మరోమారు కల్లోలం రేపుతోంది. 2019లో వూహాన్‌లో పుట్టిన ఈ మహమ్మారిని ఆ దేశస్తులు త్వరగానే వదిలించుకున్నారు.