హైద‌రాబాద్‌కి షిఫ్ట్ అవుతున్న ఫైట‌ర్‌

  • IndiaGlitz, [Thursday,July 09 2020]

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని నెల‌ల క్రితం ముంబైలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. కొంత పార్ట్ చిత్రీక‌ర‌ణ జ‌రిగిన త‌ర్వాత క‌రోనా ప్ర‌భావం మొద‌లు కావ‌డంతో లాక్‌డౌన్ విధించ‌డం ఫ‌లితంగా షూటింగ్స్ అన్నీ ఆగిపోవ‌డం జ‌రిగాయి. రెండు నెల‌ల త‌ర్వాత ప్ర‌భుత్వాలు షూటింగ్స్‌కు ప‌రిమితులు విధించిన గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ప్ప‌టికీ ముంబైలో ఇంకా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌టం లేదు. దీంతో బాలీవుడ్ హీరోలు సైతం షూటింగ్స్ స్టార్ట్ చేయ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ముంబై రావ‌డానికి వెనుకా ముందు అవుతున్నాడు.

దీంతో పూరి ముంబై సెట్‌ను హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలోనే ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. సెట్‌ను వేయ‌మ‌ని ఇప్ప‌టికే చెప్పేసిన‌ట్లు త్వ‌ర‌లోనే సెట్ పూర్తి కాగానే పూరి హైద‌రాబాద్ ల్యాండ్ అయిపోయి షూటింగ్‌ను మొద‌లు పెడ‌తాడ‌ని అంటున్నారు. ఈ సినిమా నిర్మాణంలో పూరి, ఛార్మిల‌తో పాటు బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కూడా భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అన‌న్య‌పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది.

More News

అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన ప్రబోధానంద

త్రైత సిద్ధాంతకర్త ప్రబోధానంద నేడు అనారోగ్యంతో తాడిపత్రిలో మృతి చెందారు.

తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన సుద్దాల అశోక్ తేజ

తన ఆరోగ్యంపై వదంతులు వస్తున్నాయని.. మళ్లీ తన ఆరోగ్యం క్షీణించిందని వార్తల్లో వచ్చినట్టు తెలిసిందని..

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..

ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ నేడు కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది.

‘తాగిన మత్తులో..’ అంటూ శ్రియ ఫోటో షేర్ చేసిన నిర్మాత

రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొస్చీవ్‌ను పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్న హీరోయిన్ శ్రియ సంసారంలో నిప్పులు పోసేలా ఉంది

కోలుకుంటున్న సీనియర్ నటి జయంతి

సీనియర్ నటి జయంతి కాస్త కోలుకున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమెకు కరోనా టెస్ట్ నిర్వహించగా నెగిటివ్ అని ఫలితం వచ్చినట్టు వైద్యులు తెలిపారు.