close
Choose your channels

ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా సీనియర్ జర్నలిస్ట్ వడ్డి ఓం ప్రకాశ్

Monday, April 19, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ వడ్డి ఓం ప్రకాశ్ నారాయణకు కీలక పదవి లభించింది. ఫిల్మ్ జర్నలిస్ట్‌గా కొన్ని దశాబ్దాలుగా ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సి.బి.ఎఫ్.సి), హైదరాబాద్ అడ్వయిజరీ బోర్డ్ మెంబర్‌గా ఓం ప్రకాశ్ నియమితులయ్యారు. దీని కాలపరిమితి రెండు సంవత్సరాలు. జర్నలిస్టుగా ఆయన తన జీవితాన్ని 1989లో ప్రారంభించారు. అప్పటి నుంచి పలు ప్రముఖ పత్రికలు, ఛానెళ్లలో పని చేశారు.

సూపర్ హిట్, వార్త, ఆంధ్రజ్యోతి, సాక్షి టీవీ, ఏబీయన్ ఛానెల్‌లో ఫిల్మ్ జర్నలిస్ట్‌గా వివిధ హోదాలలో ఓం ప్రకాశ్ పని చేశారు. గత రెండున్నర దశాబ్దాలుగా ఆయన జాగృతి అనే వార పత్రికలో చిత్ర సమీక్షలు రాస్తున్నారు. ప్రస్తుతం ఎన్ టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో అసోసియేటెడ్ ఎడిటర్‌గా ఓం ప్రకాశ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా ఎంపికవడంపై ఓం ప్రకాశ్ మాట్లాడుతూ.. ఫిల్మ్ జర్నలిస్ట్‌గా ఉన్న అనుభవంతో ఈ నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు. తాను సి.బి.ఎఫ్.సి. అడ్వయిజరీ బోర్డు మెంబర్ కావడానికి కారకులైన సంస్కార భారతి దక్షిణ మధ్య క్షేత్ర మాజీ ప్రముఖ్ శ్రీ కుమారస్వామికి ఓంప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.