పవన్ చిత్రంతోనే తిరిగి సినీ ప్రయాణం ప్రారంభిస్తున్నా: ఆనంద్ సాయి

  • IndiaGlitz, [Saturday,February 27 2021]

యాదాద్రి ఆలయం నిర్మాణంలో ముఖ్యంగా మనల్ని ఆకర్షించేది డిజైన్. అద్భుతమైన శిల్పాలు మండపాలు, ప్రాకారాలు ప్రతిదీ చాలా రమ్యంగా, ఆసక్తికరంగా.. దృష్టిని మరల్చనివ్వకుండా చేస్తాయి. ఇంతటి అద్భుతానికి సృష్టికర్త ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి. గత ఐదేళ్లుగా యాదాద్రి ఆలయ డిజైనింగ్‌ కోసం శ్రమిస్తున్నారు. ఈ ఐదేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవలే ఆయన ఒక సినిమాకు పని చేసేందుకు ముందుకు వచ్చారు. అది మరేదో కాదు శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కనున్న సినిమా. ఈ సినిమాతోనే తిరిగి తన సినీ ప్రయాణాన్ని కొనసాగించనున్నట్టు ఆనంద్ సాయి తెలిపారు.

ఆలయ పనుల్లో భాగంగా.. తాను సినిమాలకు కొంత కాలం దూరంగా ఉండాల్సి వచ్చిందని ఆనంద్ వెల్లడించారు. దేవుడికి సేవ చేసే అవకాశాన్ని తాను పొందానని.. నా డిజైన్స్‌ను కేసీఆర్ గారూ, కేటీఆర్ గారూ ఇష్టపడినందుకు తాను చాలా సంతోషిస్తున్నానని వెల్లడించారు. అయితే ఈ సమయంలో తాను పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో మాత్రమే తాను టచ్‌లో ఉన్నానని ఆయన తనకు చాలా క్లోజ్ అని.. అలాగే తన కుటుంబంలోని వ్యక్తి వంటి వారని ఆనంద్ తెలిపారు. ఈ నేపథ్యంలో తాను హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పవన్ చిత్రంతోనే తిరిగి ఫిల్మ్ అసైన్‌మెంట్స్‌ను ప్రారంభిస్తున్నానని తెలిపారు. తాను సినిమాల్లోకి తిరిగి రావడం చాలా గొప్పగా ఫీలవుతున్నానని.. ఇక ఈ సినిమాతో ముందుకు సాగుతానని వెల్లడించారు.

నిజానికి తన ఆలయ నమూనాల విజయం సినిమాలలో పని చేయడం వచ్చే లభించిందని ఆనంద్ సాయి వెల్లడించారు. వివిధ సినిమాల కోసం చేస్తున్నప్పుడు ఆ పనుల్లో భాగంగా వివిధ ప్రదేశాలకు వెళ్లి అక్కడి సంస్కృతుల గురించి తెలుసుకున్నామన్నారు. ఈ అవగాహనే ఆలయ డిజైన్ల సమయంలో తనకు సాయపడిందని వెల్లడించారు. భారతదేశంలోని వివిధ దేవాలయాలకు వెళ్లానని.. కాబట్టి ఆలయ నిర్మాణంపై సమగ్రమైన అవగాహన వచ్చిందని ఆనంద్ సాయి తెలిపారు.

More News

సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా బాలయ్య ఇల్లు!

సినీ ఇండస్ట్రీలో ఎవరేం చేసినా విచిత్రమే. వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా ప్రజలకు ఆసక్తికరంగా ఉంటుంది.

కన్నులపండువగా స్టార్‌ మా సండే

ఆదివారం రోజూ కన్నా కాస్త ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ కావాలనిపిస్తుంది. ఎందుకంటే - రోజూ కంటే ఇంట్లో గడిపే సమయం ఎక్కువ ఉంటుంది

'రాబర్ట్‌' ప్రీ రిలీజ్‌ వేడుక

ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శ‌న్ క‌థానాయ‌కుడిగా ఉమాప‌తి ఫిలింస్ బ్యాన‌ర్‌పై త‌రుణ్ కిషోర్ సుధీర్ ద‌ర్శ‌క‌త్వంలో

యాదాద్రి ఆలయ ప్రత్యేకతలేంటంటే..: ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి

యాదాద్రి పైన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, స్మారక టవర్లు (గోపురాలు), ఊపిరి తీసుకునే శిల్పాలు, మండపాలు, ప్రాకారాలు, స్తంభాల వరకూ ప్రతిదీ అద్భుతమే.

కొత్త క‌ళ నేర్చుకుంటోన్న రాశీఖ‌న్నా

హీరోయిన్ రాశీఖ‌న్నాముందు ఇక ఎవ‌రైనా పోకిరి వేషాలేస్తే అంతేనండోయ్‌! ఎందుకంటే.. ఈ అమ్మ‌డు ఇప్పుడు కొత్త విద్య‌ను నేర్చుకుంటోంది.