close
Choose your channels

టీఆర్ఎస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల..

Friday, November 20, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీఆర్ఎస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల..

జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్లను నేడు తుది గడువు కావడంతో టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులకు సంబంధించిన తుది జాబితాను విడుదల చేసింది. టీఆర్ఎస్ చివరి జాబితాలో 17 మంది సిట్టింగ్‌లకు మొండి చేయి చూపించారు. 8 మంది సిట్టింగ్‌లకు మరోసారి అవకాశం కల్పించారు. గ్రేటర్‌లో మొత్తంగా 99 మంది టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌లకు అవకాశం కల్పించారు. 27 మంది సిట్టింగ్‌లకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం మొండి చేయి చూపించింది. అయితే ఆశావహులు తమకు టిక్కెట్ రాకపోవడంతో అధిష్టానంపై మండిపడుతూ నిరసనలు తెలుపుతున్నారు.

టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ చివరి జాబితా అభ్యర్థులు..

ఏఎస్‌రావునగర్- పావనిరెడ్డి, చర్లపల్లి-బొంతు శ్రీదేవి యాదవ్(మేయర్ రామ్మోహన్ భార్య), మీర్‌పేట్-ప్రభుదాస్, నాచారం-సాయిజెన్‌ శేఖర్, చిలకనగర్-బన్నాల ప్రవీణ్‌ ముధిరాజ్, హబ్సిగుడ-బేతి స్వప్న రెడ్డి, ఉప్పల్-అరిటికాయల భాస్కర్, అత్తాపూర్-మాధవి, కాచిగూడ-శిరీష యాదవ్, నల్లకుంట-గరిగంటి శ్రీదేవి, అంబర్‌పేట్-విజయ్‌కుమార్ గౌడ్, అడిక్‌మెట్-హేమలతారెడ్డి, ముషీరాబాద్ - భాగ్యలక్ష్మి యాదవ్, కవాడిగూడ-లాస్యనందిత, తార్నాక-మోతే శ్రీలత, యూసఫ్‌గూడ-రాజ్‌కుమార్ పటేల్, వెంగల్‌రావు నగర్-దేదిప్య రావు, రెహమత్‌రావు నగర్-సీఎన్ రెడ్డి, నేరేడ్‌మెట్-మీనా ఉపేందర్‌రెడ్డి, ఈస్ట్ ఆనంద్‌బాగ్-ప్రేమ్‌కుమార్, గౌతమ్‌నగర్-మేకల సునీత రాముయాదవ్, గోల్‌నాక-దూసరి లావణ్య, చందానగర్-మంజుల రఘునాథ్‌రెడ్డి, హైదర్‌నగర్-నార్నే శ్రీనివాస్‌యాదవ్, మౌలాలి-ముంతాజ్ ఫాతిమా

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.