అంతా చక్కబడుతున్న వేళ మరో వివాదం.. రాజ్‌ కుంద్రా- శిల్పా శెట్టిపై చీటింగ్‌ కేసు

  • IndiaGlitz, [Monday,November 15 2021]

బాలీవుడ్ స్టార్ కపుల్ రాజ్‌కుంద్రా- శిల్పాశెట్టిలు మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే పోర్నోగ్రఫీ కేసుతో రాజ్ కుంద్రా పీకల్లోతు ఇబ్బందుల్లో వున్నారు. అటు శిల్పా సైతం ఈ ఘటన తర్వాత మీడియాకు దూరంగా తన పనేదో తాను చేసుకుంటున్నారు. అంతేకాకుండా రాజ్‌కుంద్రాకు కూడా విడాకులు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా‌లపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. దాదాపు కోటిన్నర మోసం చేశారంటూ ఓ వ్యాపారవేత్త ఈ దంపతులపై కేసు నమోదు చేశాడు.

కాషిఫ్ ఖాన్ అనే వ్యాపారవేత్త దగ్గర శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలు కోటిన్నర తీసుకున్నారట. ఫిట్ నెస్ సెంటర్ ప్రారంభిద్దామని ఒప్పందం కుదుర్చుకున్నారని... కానీ అది కార్యరూపం దాల్చకపోవడంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని కాషిఫ్ ఒత్తిడి తెచ్చాడు. దీంతో అతనికి బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలంటూ సదరు వ్యాపారవేత్త ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాల మీద చీటింగ్ కేసు నమోదు చేశాడు. సెక్షన్ 420 (చీటింగ్), 120 B, 506, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

More News

సైన్స్ ఫిక్షన్ డ్రామా  "రామ్ అసుర్"గ్రాండ్  ప్రి-రిలీజ్ వేడుక. ప్రముఖ దర్శకుడు మారుతి చేతులు మీదుగా ట్రైలర్ విడుదల

ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్  నటీనటులుగా

7 రోజుల్లో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్... 'జీ 5' ఓటీటీలో విడుదలైన 'శ్రీదేవి సోడా సెంటర్' రికార్డ్

వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు... ఏవి కావాల‌న్నా వీక్ష‌కులు ముందుగా చూసే ఓటీటీ వేదిక 'జీ 5'.

'ఎవరు మీలో కోటీశ్వరులు' లో చరిత్ర సృష్టించిన కోటి రూపాయల తొలి విజేత

NTR వ్యాఖ్యాతగా .. జెమిని టివి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అతి పెద్ద గేమ్ షో "ఎవరు మీలో కోటీశ్వరులు" లో

టిక్కెట్ల విషయంలో ఇబ్బంది నిజమే.. కానీ కోర్టుకెక్కడం లేదు, జగన్‌తోనే తేల్చుకుంటాం: ఆర్ఆర్ఆర్ మేకర్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల టాలీవుడ్ ఇబ్బందులు పడుతున్న విషయం మరోసారి తెరపైకి వచ్చింది.

"భగత్ సింగ్ నగర్" చిత్రంలోని "ఈ విశ్వమంతము వ్యాపించిన" పాటను విడుదల చేసిన హీరో శ్రీకాంత్

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ ,ధృవిక హీరో, హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో