‘ఆదిపురుష్‌’ సెట్‌లో అగ్ని ప్ర‌మాదం..!

  • IndiaGlitz, [Tuesday,February 02 2021]

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ మూడో ప్యాన్ ఇండియా మూవీగా ‘ఆదిపురుష్‌’ మంగ‌ళ‌వారం ముంబైలోని గోరేగాన్‌ స్టూడియోలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. టి సిరీస్ నిర్మాణంలో ఓం రావుత్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం గోరేగాన్ స్టూడియోలో భారీ సెట్ వేశారు. అయితే ఏమైందో ఏమో కానీ.. సాయంత్రం సెట్స్‌లో మంట‌లు రేగాయి. వేసిన సెట్ అంతా అగ్ని ప్ర‌మాదంలో పాడైంద‌ని విడుద‌లైన విజువల్స్‌ను బట్టి తెలుస్తుంది. ప్ర‌మాదంలో ఎవ‌రికీ ఎలాంటి ఆప‌ద జ‌ర‌గ‌లేదు. ప్ర‌మాదం భారీగానే జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది. మంట‌ల‌ను ఆదుపు చేయ‌డానికి 8 ఫైర్ ఇంజ‌న్స్‌, 5 జంబో ట్యాంకర్స్‌, జేసీబీ రంగంలోకి దిగాయి. షార్ట్ సర్క్యూట్ వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. తొలిరోజునే భారీ ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ప్ర‌భాస్ అభిమానులు నిరాశ ప‌డ్డారు.

ఫిబ్ర‌వ‌రి 9 త‌ర్వాత ప్ర‌భాస్ ఈ సెట్‌లోకి అడుగు పెడ‌తాడ‌ని వార్త‌లు వినిపించాయి. ఇప్పుడు ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో తొలి షెడ్యూల్ వాయిదా ప‌డుతుందా.. లేదా అని తెలియ‌డం లేదు. రామాయణంను ‘ఆదిపురుష్‌’ పేరుతో తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో రాముడిగా ప్ర‌భాస్ న‌టిస్తుంటే రావ‌ణాసురుడిగా సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ 11న సినిమాను విడుద‌ల చేస్తామ‌ని ద‌ర్శక నిర్మాత‌లు తెలిపారు.

More News

ఇలాంటి గౌరవం ఏ గురువుకూ దక్కదేమో...

తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. గురువు స్థానాన్ని దైవం కంటే ముందు పెట్టారు పెద్దలు. అంతటి ఉన్నతమైన స్థానం గురువుకి ఉంది.

థియేటర్లకు ఫుల్ పర్మిషన్.. సినిమాల రిలీజ్‌కు నిర్మాతల ఆసక్తి

కరోనా లాక్‌డౌన్ సమయంలో భారీగా నష్టపోయిన పరిశ్రమల్లో సినీ పరిశ్రమ కూడా ఒకటి. సినిమాల్లేక చిన్న చిన్న ఆర్టిస్టుల కుటుంబాలు చితికిపోయాయి.

‘ఆచార్య‌’లో మ‌రో స్టార్‌.. నిజ‌మెంత‌?

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'ఆచార్య'. స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో

సరికొత్త టైటిల్‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణ‌మ‌దే..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ 27వ చిత్రంగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

‘ఉప్పెన‌’ కోసం తారక్ స‌పోర్ట్.. చివ‌రి నిమిషంలో సుక్కు మార్పులు

సాయితేజ్ సోద‌రుడు, మెగా క్యాంప్ డెబ్యూ హీరో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టించిన చిత్రం ‘ఉప్పెన‌’.