సీరం ఇన్‌స్టిట్యూట్‌లో అగ్ని ప్రమాదం.. ఐదుగురి మృతి

  • IndiaGlitz, [Thursday,January 21 2021]

ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా(సీఐఐ)కు చెందిన నూతన ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని మేయర్ మురళీధర్ మోహోల్ వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న ఎస్ఈజెడ్-3 భవనంలోని నాలుగు, ఐదో అంతస్తుల్లో మంటలు చెలరేగడంతో దట్టంగా పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న దాదాపు 10 అగ్నిమాపక ఫైరింజన్లు రంగంలోకి దిగి రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

అయితే భవనంలో ఎందుకు మంటలు చెలరేగాయన్నది ఇంకా పూర్తిగా నిర్ధారణకు రాలేదని మేయర్ మురళీధర్ వెల్లడించారు. జరుగుతున్న వెల్డింగ్ పనుల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తాము భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వెల్లడించారు. ఈ ఘటనపై సీరమ్ సంస్థ అధినేత అదర్ పూనావాలా ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ప్రాణ నష్టం జరిగిన విషయం తెలుసుకుని బాధపడినట్టు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు అదర్ పూనావాలా ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఘటనపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. సీరం ఇన్‌స్టిట్యూట్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఐదుగురు సిబ్బంది మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు మోదీ తెలిపారు.

More News

సుప్రీంకోర్టుకెక్కిన ఏపీ ‘పంచాయతీ'

అనుకున్నదంతా అయ్యింది.. ఏపీ ‘పంచాయతీ’ సుప్రీంకోర్టుకెక్కింది. గురువారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం

నల్గొండలో ఘోర ప్రమాదం.. ఆరుగురి మృతి

పొట్టకూటి కోసం కూలి పనికి వెళ్లి.. తిరిగి ఇంటికి చేరుకుంటున్న తరుణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

నాగ‌శౌర్య‌, కేపి రాజేంద్ర కాంబినేష‌న్‌లో ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం `పోలీసు వారి హెచ్చ‌రిక`

యంగ్ హీరో నాగ‌శౌర్య‌హీరోగా కేపీ రాజేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `పోలీసు వారి హెచ్చ‌రిక‌`.

3 సింహాల మాయం కేసు నిందితులు ఇలా దొరికిపోయారట..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కనకదుర్గమ్మ రథంపై మూడు వెండి సింహాల మాయం కేసు ఓ కొలిక్కి వచ్చినట్టే తెలుస్తోంది.

కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు: పద్మారావు

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలోనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.