close
Choose your channels

సిటీ సెంటర్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం..

Friday, October 23, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై మహా నగరంలో గురువారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ ముంబైలోని సిటీసెంటర్ మాల్‌లో గురువారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు రాజుకున్న సమయంలో సిటీ సెంటర్ మాల్‌లో 300 మంది దాకా ఉన్నారు. మొదటగా సిటీ సెంటర్ మాల్‌లోని కింది అంతస్తులో మంటలు రాజుకున్నారు. వెంటనే మాల్‌లో ఉన్నవారందరినీ క్షేమంగా బయటకు తీసుకు వచ్చారు. హుటాహుటిన 20 అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపు చేశాయి.

అయితే మంటలను అదుపు చేసే క్రమంలో ఓ ఫైర్ మెన్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఫైర్ మెన్‌ను చికిత్స నిమిత్తం ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. కాగా.. మంటలు వ్యాపించిన వెంటనే మాల్ చుట్టుపక్కల ఉన్న భవనాలను ఖాళీ చేయించారు. గురువారం రాత్రి మంటలు వ్యాపించగా.. అవి శుక్రవారం ఉదయం వరకూ మంటలు అదుపులోకి రాలేదు. అగ్ని ప్రమాదానికి కారణాలైతే తెలియరాలేదు. మంటు రాజుకున్న కింది అంతస్తులో మొబైల్ ఫోన్ల యాక్ససరీలు విక్రయిస్తుంటారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.