close
Choose your channels

swapnalok complex : సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

Friday, March 17, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సికింద్రాబాద్‌లో మరో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వీరిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు వున్నారు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్‌లో అత్యంత రద్దీగా వుండే ఏరియాలో వున్న స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. చూస్తుండగానే నాలుగు, ఐదు, ఆరు అంతస్తుల్లోకి మంటలు వ్యాపించాయి. ఈ ఫ్లోర్లలో అన్ని ప్రైవేట్ కార్యాలయాలే. దట్టమైన పొగలు వ్యాపించడంతో పైన వున్న వారు కిందకి రాలేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, జీహెచ్ఎంసీ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.

గదిలో స్పృహ తప్పి పడిపోయిన ఉద్యోగులు:

మంటల తీవ్రత పెరగుతూ వుండటంతో చుట్టుపక్కల నివాస ప్రాంతాల్లో వున్న వారిని ఖాళీ చేచించారు అధికారులు. ఇదే సమయంలో పై అంతస్తులలో వున్న వారు సెల్ టార్చ్ లైట్ల ద్వారా తమను రక్షించాల్సిందిగా ఆర్తనాదాలు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద లోపలికి వెళ్లి ఒక గదిలో స్పృహ తప్పి పడిపోయిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పొగ కారణంగా ఊపిరాడకే వీరు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతులను ప్రమీల, వెన్నెల, త్రివేణి, శ్రావణి, శివ, ప్రశాంత్‌‌లుగా గుర్తించారు.

ఘటనాస్థలికి మహమూద్ అలీ, తలసాని :

అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్దకు వచ్చారు. అనంతరం అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనలో గాయపడిన వారు అపోలో, యశోదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అసలు ప్రమాదానికి దారి తీసిన కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.