దుబాయ్ డ్యూటీ ఫ్రీ గిడ్డంగి యార్డులో మంటలు.. విశేషం ఏంటంటే..

  • IndiaGlitz, [Wednesday,August 12 2020]

దుబాయ్ డ్యూటీ ఫ్రీ గిడ్డంగి యార్డులో సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి కాస్తా క్షణాల్లో దావానంలా వ్యాపించాయి. ఆ మంటలను దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు క్షణాల్లో అదుపులోకి తీసుకు రావడం.. ఒక్కరికి కూడా చిన్న గాయం కాకుండా రక్షించగలగడం విశేషం. డ్యూటీ ఫ్రీ సైట్ వద్ద కూలింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి.

మధ్యాహ్నం 2 గంటలకు మంటలు చెలరేగాయి. వెంటనే అంటే మధ్యాహ్నం 2.02 గంటలకు అల్ రషీడియా స్టేషన్ నుంచి సివిల్ డిఫెన్స్ బృందాలు మంటల గురించి సమాచారం అందుకున్నాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. అంతే కాదు.. కొద్ది నిమిషాల్లోనే కచ్చితంగా చెప్పాలంటే.. మధ్యాహ్నం 2.16 గంటల కల్లా అగ్నిమాపక సిబ్బంది మంటలను నియంత్రించగలిగింది. అంతేకాదు ఒక్కరికి కూడా ఎలాంటి ప్రమాదమూ లేకుండా సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు.

దుబాయ్ డ్యూటీ ఫ్రీ తన ఉద్యోగులందరినీ సురక్షితంగా.. సకాలంలో బయటకు తరలించారు. ఈ సంఘటనలో ఏ ఒక్కరికీ ఎటువంటి గాయాలు సంభవించలేదని డ్యూటీ ఫ్రీ యాజమాన్యం తెలిపింది. తక్షణమే స్పందించి మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బందికి డ్యూటీ ఫ్రీ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

More News

దేవా కట్టా.. విష్ణు ఇందూరిల మధ్య రాజుకుంటున్న వివాదం

‘ప్రస్థానం’ దర్శకుడు దేవా కట్ట.. నిర్మాత విష్ణు ఇందూరిల మధ్య వివాదం రాజుకుంటోంది.

బిగ్‌బాస్ 4 వాయిదా?

తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్‌. తెలుగులో స్టార్ మాలో ప్ర‌సారం అవుతున్న‌ ఈ రియాలిటీ షో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సీజ‌న్స్‌ను పూర్తి చేసుకుంది.

చిరుకు ఓకే అన‌లేదు.. మ‌రి బాల‌య్య ఓకే అన్న‌ట్లేనా?

ఓ బాలీవుడ్ న‌టుడిని చిరంజీవి మ‌ల‌యాళ రీమేక్ లూసిఫ‌ర్ కోసం సంప్ర‌దిస్తే.. బిజీగా ఉన్నాను..

‘వ‌కీల్‌సాబ్’ ట్రీట్ సిద్ధ‌మ‌వుతోందా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు.

తెలంగాణకు భారీ ఆఫర్.. రూ.1200 కోట్ల పెట్టుబడికి మెడ్ ట్రానిక్స్ సిద్ధం

మెడికల్ డివైస్ తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మెడ్ ట్రానిక్స్ తెలంగాణను తన పెట్టుబడి గమ్యస్థానంగా ఎంచుకుంది.