చైతన్య కృష్ణ, పాయల్‌ రాజ్‌పుత్‌ 'అనగనగా ఓ అతిథి' ఫస్ట్‌లుక్‌ విడుదల

  • IndiaGlitz, [Thursday,October 29 2020]

తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌మెంట్‌తో అలరిస్తున్న హండ్రెడ్‌ పర్సెంట్‌ తెలుగు ఓటీటీ 'ఆహా'. కోవిడ్‌ సమయంలో వరుస కొత్త చిత్రాలతో ఆకట్టుకున్న ఆహా ఇప్పుడు తమ ఓటీటీలో 'అనగనగా ఓ అతిథి' చిత్రాన్ని నవంబర్‌ 13న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 'అనగనగా ఓ అతిథి' పీరియాడికల్‌ మూవీ. కన్నడ చిత్రపరిశ్రమలో అవార్డ్ విన్నింగ్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు దయాల్‌ పద్మనాభన్‌ తెలుగులో డైరెక్ట్‌ చేస్తున్న తొలి చిత్రమిది. ఓ కుటుంబ పేద‌రికంతో బాధ‌ప‌డుతుంటుంది. వారి కష్టాల‌ను దాట‌డానికి ఓ జ్యోతిష్యుడు చెప్పిన జాత‌కం అలానే వారి జీవితం లోకి వచ్చిన అతిథి వ‌ల్ల కుటుంబ స‌భ్యుల‌కు అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. దురాశ, మోహం, అత్యాశ వంటి ఎలిమెంట్స్‌ను సూచించేలా ఇందులో పాత్రలు ఉంటాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి విడుదల చేశారు. ఈ సందర్భంగా...

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ సీట్‌ఎడ్జ్‌ థ్రిల్లర్‌ మూవీగా ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో 'అనగనగా ఓ అతిథి' చిత్రం ఊహించని మలుపులతో ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు అన్నారు. డైరెక్టర్‌

దయాల్‌ పద్మనాభన్‌ మాట్లాడుతూ తెలుగులో ఎంట్రీ ఇస్తుండటం చాలా హ్యాపీగా ఉంది. మంచి టీమ్‌తో కలిసి పనిచేశాను. ఎమోషన్స్‌, డ్రామ, సస్పెన్స్‌ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ ఉన్న చిత్రమిది అన్నారు.

పాయల్‌ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు నేను చేయని ఓ డిఫరెంట్‌ పాత్ర. పాత్‌ బ్రేకింగ్ పాత్ర చేశానని హ్యాపీగా అనిపిస్తుంది అన్నారు.

చైతన్య కృష్ణ మాట్లాడుతూ ఈ సినిమాలో చేసిన పాత్ర కొత్తగా అనిపిస్తుంది. డైరెక్టర్‌ దయాల్‌ పద్మనాభన్‌గారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు అన్నారు.

తెలుగు ప్రేక్ష‌కుల అభిమాన తార‌లు న‌టించిన చిత్రాలతో పాటు క్లాసిక్ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల‌తో ఆహా తెలుగు ప్రేకకుల హృద‌యాల‌కు ద‌గ్గ‌రైంది. వారికి మరింత ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందించే దిశ‌గా మేం ఇంకా గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. ‘భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ‌, జోహార్‌, ఒరేయ్ బుజ్జిగా’, క‌ల‌ర్‌ఫొటో’ చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించాయి. ఇప్పుడు వీటి సరసన 'అనగనగా ఓ అతిథి' చిత్రం చేరనుంది.

More News

హెలికాఫ్టర్‌లో పెళ్లికి హైదరాబాద్ కుటుంబం.. కేసు నమోదు

హంగూ ఆర్భాటాల కోసమో.. రిచ్‌నెస్‌ను ప్రదర్శించుకోవడం కోసమో.. లేదంటే మరే కారణమో కానీ..

అంత త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదు: సాయి తేజ్

తన పెళ్లిపై వస్తున్న వార్తలపై సుప్రీం హీరో సాయి తేజ్ స్పందించాడు. తనకు అంత త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదని స్పష్టం చేశాడు.

మ్యాచ్ మధ్యలో భార్యకు విరాట్ సైగలు.. వీడియో వైరల్..

ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్‌లకు అబుదాబి వేదికగా మారిన విషయం తెలిసిందే.

అమ్మ చాక్లెట్ రచ్చ.. హారికపై అభి ఫైర్

నిన్నటి బేబి డే కేర్ టాస్క్ ఇవాళ కూడా కంటిన్యూ అయింది. హారిక చాక్లెట్స్‌ను కొట్టేసింది. దీంతో అమ్మ రాజశేఖర్ బాగా హర్ట్ అయ్యారు. ఇంక నేను ఆడనని తేల్చేశారు. అయితే ఎవరు చెప్పినా హారిక వినలేదు.

బిహార్ తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో 53.54 శాతం ఓటింగ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నేడు ప్రారంభమయ్యాయి. నేడు మొదటి దశ పోలింగ్‌ జరిగింది. ఈ పోలింగ్‌లో 53.54 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.