PM Modi:తొలి అండర్ వాటర్ మెట్రో రైలు ప్రారంభం.. విద్యార్థులతో కలిసి ప్రయాణించిన ప్రధాని మోదీ

  • IndiaGlitz, [Wednesday,March 06 2024]

దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో రైలును పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఎస్ ప్లనేడ్ నుంచి హావ్ డా మైదాన్ స్టేషన్ వరకు విద్యార్థులతో కలిసి రైలులో ప్రయాణించారు. విద్యార్థులతో పలు అంశాలపై సరదాగా చర్చించారు. ఈ సందర్భంగా మెట్రో సిబ్బంది మోదీకి నదీగర్భం రైలు ప్రయాణ విశేషాలను వివరించారు. మోదీ వెంట బీజేపీ చీఫ్ సుకాంత్ మజుందార్, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారికూడా ఉన్నారు. నదీగర్భం గుండా మెట్రో రైలులో విద్యార్థులతో కలిసి మోదీ ప్రయాణించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నీటి అడుగున మెట్రో రైలు నిర్మించి కోల్‌కతా మరో సరికొత్త రికార్డును సృష్టించింది. కోల్‌కతా ఈస్ట్‌ - వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. కోల్‌కతా ఈస్ట్‌ - వెస్ట్‌ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లుగా ఉంది. ఇందులో 10.8 కి.మీ. భూగర్భంలో ఉంటుంది. హావ్‌డా మైదాన్‌ నుంచి ఎస్‌ప్లెనెడ్‌ స్టేషన్ల మధ్య 4.8 కి.మీల మేర ఉన్న లైనులో భాగంగా 520 మీటర్ల పొడవైన అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ నిర్మించారు. నదిలోని ఈ దూరాన్ని కేవలం 45 సెకన్లలోనే దాటనుండటం విశేషం.

దేశంలో తొలిసారి మెట్రో రైలు సేవలు కోల్‌కతాలనే ప్రారంభమయ్యాయి. 1984లోనే కోల్‌కతా నగరంలో మెట్రో పరుగులు పెట్టింది. ఇప్పుడు అండర్ వాటర్ మెట్రోతోనూ చరిత్ర సృష్టించింది. కాగా ఈస్ట్‌-వెస్ట్‌ మెట్రో కారిడార్‌కు ఫిబ్రవరి 2009లో పునాది పడగా.. అండర్‌ వాటర్‌ మార్గం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ప్రకృతి విపత్తుల్ని సైతం తట్టుకునేలా ఈ కారిడార్‌ను బ్రిటన్‌కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో నిర్మించారు. ప్రస్తుతం హావ్‌డా నుంచి సీల్దాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్ఠంగా 90 నిమిషాల సమయం పడుతుండగా.. అండర్‌వాటర్‌ మెట్రో మార్గం ఏర్పాటుతో ఈ ప్రయాణ సమయం 40 నిమిషాలకు తగ్గనుంది. రేపటి నుంచి ఈ సర్వీస్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.

More News

Mudragada:వైసీపీలోకి ముద్రగడ.. ముహుర్తం కూడా ఖరారు..!

ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడూ ఏ నేత ఏ పార్టీలో చేరతారో తెలియని పరిస్థితి నెలకొంది.

Pawan Kalyan Chandrababu: చంద్రబాబుతో పవన్ కల్యాణ్‌ కీలక భేటీ.. బీజేపీతో పొత్తుపై చర్చలు..

టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్..

TDP Janasena:50 ఏళ్లకే నెలకు రూ.4వేల పెన్షన్.. టీడీపీ-జనసేన కీలక హామీ..

పది సూత్రాలతో తెలుగుదేశం- జనసేన పార్టీలు ఉమ్మడిగా బీసీ డిక్లరేషన్‌ ప్రకటించాయి. మంగళగిరిలో జయహో బీసీ పేరుతో నిర్వహించిన వేదికపై చంద్రబాబు,

NTR:మరో బాలీవుడ్‌ సినిమాలో ఎన్టీఆర్.. తారక్ క్రేజ్ మామూలుగా లేదుగా..

RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Revanth Reddy:ప్రధాని మోదీకి 11 విజ్ఙప్తులు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏంటంటే..?

రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ తిరిగి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిపోయారు.