ఐదు పాత్రల 'చిత్రలహరి'
- IndiaGlitz, [Tuesday,January 15 2019]
90 దశకంలో 'చిత్రలహరి' కార్యక్రమం అంటూ చాలా క్రేజ్ ఉండేది. కొత్త సినిమా పాటలు వినడానికి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఇప్పుడు అదే టైటిల్తో సినిమా రూపొందుతోంది. కిషోర్ తిరుమల డైరెక్షన్లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న చిత్రమిది.
కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్లో ఐదు అక్షరాలున్నట్లుగానే సినిమాలో ఐదు పాత్రలు కీలకంగా ఉంటాయట.
ఈ సినిమాను ఏప్రిల్ 12న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు.