అఖిల్ సినిమాలో ప్లాప్ హీరోయిన్‌

  • IndiaGlitz, [Wednesday,December 02 2020]

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’. ప్రస్తుతం సినిమా తుది దశ చిత్రీకరణ దశకు చేరుకుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌.. కాగా మేక‌ర్స్ ఇప్పుడు మ‌రో హీరోయిన్‌ను కూడా న‌టింప చేస్తున్నారు. అఖిల్‌తో చేస్తున్న సెకండ్ హీరోయిన్ ఎవ‌రో కాదు.. నేహా శెట్టి. ఇంత‌కు ముందు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌నిర్మాణంలో రూపొందిన మెహ‌బాబూ చిత్రంలో నేహా శెట్టినే హీరోయిన్‌. మెహబూబా స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డంతో నేహాకు అవ‌కాశాలు రాలేదు. చాలా గ్యాప్ త‌ర్వాత ఈ అమ్మ‌డు అఖిల్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’లో న‌టిస్తుంది. ప్ర‌స్తుతం నేహా షూటింగ్‌లో పాల్గొంటోంది. సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. నిజానికి ఈ సమ్మ‌ర్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌నేది మేక‌ర్స్ ఆలోచ‌న‌. అయితే వీరి ఆలోచ‌న‌ల‌కు క‌రోనా వైర‌స్ బ్రేకులేసింది. ఇప్పుడు వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చి అఖిల్ మూడు సినిమాలు చేసినా.. ఏ సినిమా కూడా ఆయ‌న‌కు ఆశించిన స్థాయిలో బ్రేక్ ఇవ్వ‌లేదు. దీంతో అఖిల్ త‌న ఆశ‌ల‌న్నీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’పైనే పెట్టుకున్నాడు. మ‌రి ఈ సినిమా ఎలాంటి విజ‌యాన్ని ద‌క్కించుకుంటుందో వేచి చూడాలి. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.