నాలుగోసారి...

  • IndiaGlitz, [Monday,July 17 2017]

మణిరత్నం, మాధవన్‌ కాంబినేషన్‌లో నాలుగో చిత్రం రాబోతుంద‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు అంటున్నాయి.వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో గ‌తంలో వచ్చిన సఖి' యువ', అమృత', చిత్రాలు ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను పొందాయి. మూడు చిత్రాలు మ్యూజిక‌ల్‌గా కూడా మంచి విజ‌యాన్ని సాధించాయి. ఇప్పుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో మాధ‌వ‌న్ న‌టించ‌బోయే సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా రూపొంద‌నుంది. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన రీసెంట్ మూవీ చెలియా అనుకున్నంత‌గా ఆద‌ర‌ణ‌ను పొందేలు. దీంతో మ‌ణిర‌త్నం ఈసారి ప్రేమ‌క‌థ‌ను కాకండా మంచి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను తెర‌కెక్కించాలనుకుంటున్నాట‌. ఈ సినిమాకి ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం సమకూరుస్తారు.