మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్..

  • IndiaGlitz, [Wednesday,January 06 2021]

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఆమెతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్‌ కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసులో తన ప్రమేయమేమీ లేదని.. ఈ ఆరోపణల్లో నిజం లేదని అఖిల ప్రియ వెల్లడించారు. తన భర్త కిడ్నాప్ చేయించే వ్యక్తి కాదని.. అసలు ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. అలాగే తమ కుటుంబ సభ్యులను సైతం పోలీసులు అరెస్ట్ చేయలేదన్నారు. తనకు కొంత సమయం ఇస్తే అన్ని విషయాలు అన్ని విషయాలనూ మీడియాకు వెల్లడిస్తానని తెలిపారు. దయచేసి తప్పుడు వార్తలను ప్రసారం చేయవద్దని మీడియాను అఖిలప్రియ కోరారు.

కాగా.. నగరంలోని బోయినపల్లి మనోవికాస్ నగర్‌లో సినీ ఫక్కీలో కేసీఆర్ సోదరి తరుఫు సమీప బంధువులైన ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్‌రావులను గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఐటీ అధికారుల పేరుతో హాకీ క్రీడాకారుడు ప్రవీణ్ ఇంట్లోకి ప్రవేశించిన కిడ్నాపర్లు.. భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ పేరుతో బెదిరింపులకు పాల్పడటమే కాకుండా ప్రవీణ్‌తో పాటు అతని సోదరులను కూడా కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదులో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. కిడ్నాప్‌నకు గురైన ముగ్గురినీ వికారాబాద్‌లో గుర్తించారు.

ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్‌రామ్, మరిది చంద్రహాస్‌లను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కాగా.. గత కొంతకాలంగా హాఫీజ్‌పేటలోని వంద కోట్ల విలువైన భూమి కోసం కొంతకాలంగా అఖిల ప్రియ కుటుంబానికి, ప్రవీణ్ రావు కుటుంబానికి గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ల్యాండ్ వ్యవహారంలోనే ముగ్గురినీ కిడ్నాప్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

More News

కర్ణాటక సీఎంకు రూ. 25 వేల జరిమానా..

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మైకేల్ డి.కున్హా రూ.25 వేల జరిమానా విధించారు.

డేట్ ఫిక్స్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి...!

టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒక‌రైన విజ‌య్ దేవ‌ర‌కొండ.. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఛాలెంజింగ్ రోల్‌లో హెబ్బా ప‌టేల్‌..!

‘కుమారి 21 ఎఫ్‌’ సూప‌ర్‌హిట్ కావ‌డంలో త‌న‌దైన పాత్ర‌ను పోషించిన హీరోయిన్ హెబ్బా ప‌టేల్‌..

బ‌న్నీ మూవీలో సాయిప‌ల్ల‌వి.. ఆ పాత్ర‌కు ఓకే చెబుతుందా?

విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు చేస్తూ హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుంది సాయిప‌ల్ల‌వి.

‘ఆచార్య‌’ సినిమాకు స్ఫూర్తి అదేనా..?

డైరెక్ట‌ర్ కొర‌టాల శివ త‌న క‌థ‌ల‌ను నిజ జీవిత ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని రాసుకుంటాడ‌ని ఆయ‌న సినిమాల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది.