close
Choose your channels

మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో మృతి

Tuesday, August 4, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో రాజయ్య బాధపడుతున్నారు. ఆయన కరోనా లక్షణాలు కనిపించడంతో కుటుంబసభ్యులు సోమవారం కరోనా పరీక్ష చేయించారు. పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయనను భద్రాచలం నుంచి విజయవాడకు తరలిస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుతో రాజయ్య మృతిచెందారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999,2004, 2014లో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సీపీఎం నేతగా ప్రజల పక్షాన పోరాడారు. కొద్ది కాలంగా ఆయన తన స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా వరరామచంద్రాపురం మండలం సున్నంవారిగూడెంలో ఉంటున్నారు. సున్నం రాజయ్య మృతితో ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది. కాగా... ఆయన కుమారులిద్దరితో పాటు అల్లుడికి కూడా కరోనా సోకడంతో వారు ప్రస్తుతం బొమ్మూరులో చికిత్స పొందుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.