కృష్ణా జిల్లాలో విషాదం.. ప్రాణం తీసిన ఈత సరదా, మున్నేరులో మునిగి ఐదుగురు బాలురు మృతి

  • IndiaGlitz, [Tuesday,January 11 2022]

కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మున్నేరులో ఐదుగురు విద్యార్థులు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. చందర్లపాడు మండలం ఏటూరు వద్ద ఈ ఘటన జరిగింది. మృతులను మాగులూరి సన్నీ (12), కర్ల బాలయేసు (12), జెట్టి అజయ్‌ (12), మైలా రాకేష్‌ (11), గురజాల చరణ్‌ (14)గా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.. సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటివద్దే ఉంటున్న ఈ ఐదుగురు విద్యార్ధులు సోమవారం మున్నేరులో స్నానానికి వెళ్లారు. పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చే సరికి పిల్లలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఎంత గాలించినా పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో విద్యార్థులు మున్నేరువైపు వెళ్లారని పశువుల కాపరి చెప్పడంతో అంతా అక్కడికి పరుగులు తీశారు. అక్కడకు వెళ్లి చూసే సరికి బట్టలు, సైకిళ్లు కనిపించాయి. అయితే పిల్లల ఆచూకీ లభించకపోవడంతో వెంటనే పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, పోలీసు, రెవెన్యూ సిబ్బంది సోమవారం సాయంత్రం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గల్లంతైన విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు.

సంక్రాంతికి పండుగకు గ్రామమంతా సిద్ధమవుతున్న వేళ.. ఈ ఐదుగురు చిన్నారుల మరణం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తమ బిడ్డలు లేరన్న వార్త తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

More News

కోవిడ్ బారినపడ్డ లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. ఐసీయూలో చికిత్స

దేశంలో కోవిడ్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. వరుస పెట్టి ఒక్కొక్క సినీ ప్రముఖుడు పాజిటివ్‌గా తేలుతున్నారు.

మంత్రి హరీశ్‌రావును కలిసిన బాలకృష్ణ.. క్యాన్సర్ హాస్పిటల్‌కు సాయంపై వినతి

సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుని కలిశారు.

అదిరిపోయిన మహేష్ మేనల్లుడి 'హీరో' ట్రైలర్ .. అశోక్ గల్లా లుక్స్ అదుర్స్

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇలా ఎక్కడ చూసినా వారసుల ఎంట్రీలు మళ్లీ ఊపందుకున్నాయి.

రాజ'శేఖర్'లో శివానీ రాజశేఖర్...‌

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'శేఖర్'. ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

టికెట్ ధరల వివాదం... ముగిసిన ఆర్జీవీ - పేర్ని నాని భేటీ , చివరికి ఏం తేల్చారంటే..?

ఏపీ  సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ భేటీ అయ్యారు.