close
Choose your channels

నాడు జగన్.. నేడు టీడీపీ నేతల్లో ‘శుక్రవారం’ టెన్షన్

Saturday, July 4, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాడు జగన్.. నేడు టీడీపీ నేతల్లో ‘శుక్రవారం’ టెన్షన్

కొద్ది రోజుల క్రితం వరకూ ఏపీ సీఎం జగన్‌ను పట్టుకున్న ‘శుక్రవారం’ టెన్షన్ ఇప్పుడు టీడీపీ నేతలను పట్టుకుందా? అసలు యాధృశ్చికమా? లేదంటే కావాలనే చేస్తున్నారా? ఏది ఏమైనా ‘శుక్రవారం’ మాత్రం దడ పుట్టిస్తోంది. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించే రకం జగన్ కాదని ఆయనను ఎరిగిన వారెవరైనా చెబుతారు. నాడు కేసులతో ఆయనను పలు రకాలుగా టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. శుక్రవారం వస్తుందంటేనే ఆయనపై సెటైర్లు మామూలుగా పడేవి కావు. అయితే ఇప్పుడా సెటైర్లన్నీ యూ టర్న్ తీసుకుంటున్నట్టుగా పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతోంది.

ఈఎస్‌ఐ కేసులో టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడు అరెస్టైంది.. శుక్రవారం రోజే.. తాజాగా గుంటూరులో జరిగిన వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా శుక్రవారం రోజే అరెస్ట్ అయ్యారు. ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతుందని.. మరికొందరు టీడీపీ నేతలు పలు కేసుల్లో అరెస్ట్ కాబోతున్నారని సమాచారం. మరి ఆ అరెస్టులు కూడా శుక్రవారం రోజే జరుగుతాయా? లేదో వేచి చూడాలి. నిజానికి ఇవి యాధృచ్చికంగా జరిగి ఉండవచ్చేమో కానీ.. ఇద్దరూ వేర్వేరు తేదీల్లో ఒకే వారం అరెస్ట్ అవడం మాత్రం గమనార్హం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.