ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలంతా టీవీల ముందే!

  • IndiaGlitz, [Friday,December 06 2019]

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలోని నిందితులను శుక్రవారం తెల్లావారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయం జరిగిందిని సామాన్యులు సైతం చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటన జరిగినట్లు తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతం నుంచే అటు టీవీ చానెల్స్‌లో.. ఇటు వెబ్‌సైట్లలో పెద్దఎత్తున వార్తలు వచ్చాయి.

దీంతో అసలేం జరిగింది..? నిందితులను నిజంగానే చంపేశారా.. లేకుంటే ఇంకేమైనా జరిగిందా..? అనే విషయాలను తెలుసుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా టీవీలకే అతుక్కుపోయారు. ఏ ఇంట చూసినా టీవీల్లో ఇదే న్యూస్.. ఇదే హడావుడి. మరోవైపు టీవీలు అందుబాటులో లేని వాళ్లు యూ ట్యూబ్, వెబ్‌సైట్లలో పెద్ద ఎత్తున చూశారు. అంతేకాదు.. అటు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. అంతేకాదు.. తమదైన శైలిలో నెట్టింట్లో కామెంట్స్ రూపంలో రియాక్ట్ అవుతున్నారు. మరోవైపు టీవీ చూసిన జనాలు ఈ ఘటనపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనాస్థలిలో.. దిశా ఇంటి దగ్గర బాణసంచా కాల్చి.. స్వీట్లు పంచి.. పండగ చేసుకుంటున్నారు.

More News

'డిస్కోరాజా' టీజర్ విడుదల

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ డిస్కోరాజా. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా బృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది.

'దిశ' కు ఇది నిజమైన నివాళి: మెగాస్టార్ చిరంజీవి

దిశ సంఘటనలో నిందితులు పోలీసు కాల్పుల్లో మృతిచెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం , సహజ న్యాయం  అని నేను భావించాను.

సజ్జనార్‌కు థ్యాంక్స్ చెప్పిన స్కూల్ ‌పిల్లలు!

దిశపై అత్యాచారం చేసి హత్యచేసిన నలుగురు కామాంధుల పాపం పండింది!. ఇవాళ తెల్లవారుజామున నిందితుల పారిపోతుండగా పోలీసులు

బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను హ్యాట్రిక్ మూవీ ప్రారంభం

`సింహ, లెజెండ్` లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో

శ్రీవిష్ణు హీరోగా 'ఎల్.ఎల్.పి' చిత్రం ప్రారంభం

యువ కథానాయకుడు శ్రీవిష్ణు  హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఎల్.ఎల్.పి.