ఫ్రస్టేషన్.. చిరాకు, కోపం వచ్చేవి: రాశి ఖన్నా

  • IndiaGlitz, [Sunday,October 11 2020]

సక్సెస్‌తో సంబంధం లేకుండా రాణించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే.. అది రాశీఖన్నాయేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా తన పనేంటో తను చూసుకుంటూ వెళుతుంటుంది. నటనను అత్యంత ప్రేమించే రాశిఖన్నా.. సక్సెస్, ఫెయిల్యూర్‌లను పెద్దగా పట్టించుకోదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికర విషయాలను ఓ ప్రముఖ పత్రికతో పంచుకుంది. ఈ సందర్భంగా లాక్‌డౌన్ టైమ్‌లో తన పరిస్థితి గురించి వెల్లడించింది.

మొదట్లో లాక్‌డౌన్ కొద్ది రోజులే ఉంటుందని భావించినట్టు రాశిఖన్నా తెలిపింది. కరోనా ఉద్ధృతి పెరగడంతో ఎప్పుడూ పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందట. మొదటి నెల ఓకే! రెండో నెల ఫ్రస్ట్రేషన్‌ మొదలయిందని... చిరాకు, కోపం వచ్చేవని రాశి వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాను పాత హాబీలను ప్రాక్టీసు చేయటం మొదలుపెట్టానని తెలిపింది. గిటార్‌ నేర్చుకోవడంతో పాటు... తమిళం కూడా నేర్చుకోవటం మొదలుపెట్టానని రాశి వెల్లడించింది. బెటర్‌ లుక్‌ కోసం జిమ్‌... సమయం గడవడం కోసం నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త సిరీస్‌లు చూశానని.. ఇలా ఆ నెల కూడా గడిచిపోయిందని రాశి తెలిపింది.

ఇక మూడో నెలలోకి ప్రవేశించిన తర్వాత తన ఆలోచనల్లో మార్పు వచ్చిందని... సమయాన్ని వృథా చేయకుండా కథలు వినటం మొదలుపెట్టానని రాశి వెల్లడించింది. బంధువులు, మిత్రులతో జూమ్‌ కాల్స్‌తో కలవటం మొదలుపెట్టడంతో చాలా రిలీఫ్‌ అనిపించిందని తెలిపింది. ఆరు నెలల తర్వాత సెట్‌లోకి అడుగుపెడితే- సొంత ఇంటికి వెళ్లినట్లనిపించిందని రాశి వెల్లడించింది. అంతే కాకుండా ఇప్పుడు తాను చేస్తున్నవన్నీ వైవిధ్యభరితమైన పాత్రలేనని.. ప్రస్తుతం తమిళంలో ‘మేధావి’, ‘ఆరన్మణై 3’ చేస్తున్నానని తెలిపింది. తెలుగులో మూడు సినిమాలు కథల స్టేజ్‌లు ఉన్నాయని. ఒక వెబ్‌ సిరీస్‌ చేస్తున్నానని. ఒక్క మాటలో చెప్పాలంటే మళ్లీ బిజీ అయిపోయానని రాశి వెల్లడించింది.

More News

ఆస్తుల వివరాలను నమోదు చేయించుకున్న సీఎం కేసీఆర్..

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమం జరుగుతోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆస్తుల వివరాలను నమోదు చేసుకున్నారు.

సింగిల్ ఫ్రేమ్‌లో మెగాస్టార్ డైరెక్టర్లు.. వైరల్ అవుతున్న పిక్..

రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా అనంతరం ఒక సినిమా చేస్తూ వచ్చారు. తాజాగా మాత్రం స్పీడ్ అందుకున్నారు.

ఇంటికెళ్లిపోయిన గంగవ్వ .. కంటెస్టెంట్లను వాయించేసిన నాగ్..

బుట్టబొమ్మ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున కూల్ కూల్‌గా వచ్చారు. కానీ ఒక్కొక్కరిపై కొరడా ఝుళిపించారు. పేరు పేరునా వాయించి వదిలిపెట్టారు.

'ఒరేయ్ బుజ్జిగా..'మూవీతో మా గోల్ రీచ్ అయినందుకు హ్యాపీగా ఉంది - యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన చిత్రం

ఆర్జీవీ సినిమాపై హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిశ ఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రాంగోపాల్‌వర్మ దిశ సినిమాపై ఆమె తండ్రి శ్రీధర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.