మోహన్‌బాబు, రానాల మధ్య ఫన్నీ కాన్వర్సేషన్.. బయటపడ్డ అసలు నిజం

  • IndiaGlitz, [Wednesday,March 17 2021]

కొన్ని మూవీ ఈవెంట్స్ అనుకోకుండా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అలా బయటకు వచ్చిందే ‘ఆచార్య’ టైటిల్. మెగాస్టార్ చిరంజీవి ఓ ఈవెంట్‌కు హాజరై అనుకోకుండా టైటిల్ రివీల్ చేసి నాలుక కరుచుకున్నారు. అలాగే నేడు జరిగిన ‘మోసగాళ్లు’ ఈవెంట్‌లో కూడా ఆసక్తికరంగా ఓ విషయం బయటకు వచ్చింది. మంచు విష్ణు, కాజల్ జంటగా నటించిన చిత్రం ‘మోసగాళ్లు’. ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు సైతం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానా దగ్గుబాటిని ఆహ్వానించారు.

అయితే రానా చెప్పిన సమయానికంటే చాలా ఆలస్యంగా కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా మోహన్‌బాబు సరదాగా.. ఏమయ్యా! ఎప్పుడో ఏడు గంటలకు రమ్మంటే ఇప్పుడు వచ్చావు. రేపు నువ్వు నాతో సినిమా చేస్తున్నావు కదా.. ఏడు గంటలకు రమ్మంటే పది గంటలకు వస్తాను అన్నారు(నవ్వుతూ). దానికి రానా నవ్వుతూ నేను మీ ఇంట్లోనే షూటింగ్‌ చేసుకుంటాను సార్‌.. మీరు ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడే షూటింగ్‌ చేసుకుంటాను అని అన్నాడు. ఈ సంభాషణ చాలా ఆసక్తికరంగా సాగడంతో పాటు ఓ విషయాన్ని అనుకోకుండా బయటపెట్టినట్టైంది.

అదేంటంటే.. రానా దగ్గుబాటి నిర్మాణ సారథ్యంలో మోహన్‌బాబు నటిస్తున్నారనే విషయం అనూహ్యంగా బయటపడింది. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 'ఆకాశం నీ హద్దురా' సినిమాలో నటించి మెప్పించి కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు.. ఇప్పుడు బిజీబిజీగా మారిపోతున్నారు. కీలక పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'సన్నాఫ్‌ ఇండియా'. ఈ సినిమా తరువాత రానా నిర్మాణంలో మోహన్‌బాబు సినిమా చేస్తారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా వివరాలన్నింటినీ అధికారికంగా ప్రకటిస్తారని టాక్.

More News

హైదరాబాద్‌లో ఒకే స్కూలులోని 38 మంది విద్యార్థినులకు కరోనా

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా పాఠశాలల్లో ఈ మహమ్మారి తన విశ్వరూపం చూపిస్తోంది. కరోనా సమయంలో పాఠశాలలు తెరవడం.

కరోనాతో షూటింగ్‌కు బిగ్‌బాస్ బ్యూటీ.. కేసు నమోదు

కరోనా వైరస్ వచ్చి ఏడాది గడిచినా దాని ప్రభావం మాత్రం ఇంకా తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ విపరీతంగా నష్టపోయింది.

బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్‌కు షాక్.. కోర్టు జరిమానా

బుక్ మై షో, పీవీఆర్ సినిమాస్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఊహించని విధంగా జరిమానా విధించింది. ఇంటర్నెట్ హ్యాండిలింగ్ చార్జీల పేరుతో ప్రేక్షకుల నుంచి అదనంగా డబ్బులు

'దృశ్యం 2' సెట్స్‌లో జాయిన్ అయిన మీనా

‘దృశ్యం’ సినిమా సింపుల్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మలయాళం రీమేక్ అయిన ఈ సినిమా.. తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కింది. థ్రిల్లర్ జోనర్‌లో ఈ చిత్రం రూపొందింది.

'స‌లార్‌'లో కేజీయ‌ఫ్ స్టార్‌..!

ఇద్ద‌రు ప్యాన్ ఇండియా స్టార్స్ క‌లిసి సినిమా చేస్తుంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఈ సినిమా కోసమే ఎదురుచూస్తుంటుంద‌న‌డంలో సందేహ‌మే లేదు.