కిషన్ రెడ్డితో గల్లా, అఖిల ప్రియ భేటీ

  • IndiaGlitz, [Saturday,September 21 2019]

కిషన్ రెడ్డితో గల్లా, అఖిల ప్రియ భేటీకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో టిడిపి ఎంపీ గల్ల జయదేవ్, భూమా అఖిల ప్రియల భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని కిషన్ రెడ్డి నివాసంలో సమావేశం అయిన వారు... తాజా రాజకీయ పరిణామాల పై చర్చించారు. దివంగత నేత కోడెల శివప్రసాద్ రావు పై పెట్టిన కేసులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కర్నూల్ లో జరుగుతున్న రాజకీయ దాడులను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్యాక్షన్ గ్రామాల్లో పరిస్థితులు చక్కదిద్దాలని అన్నారు. వీరి ఫిర్యాదులను స్వీకరించిన కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే భూమా అఖిల ప్రియ త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు కాషాయం తీర్థం పుచ్చుకోగా.... అఖిల టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ లేక వైసీపీలో చేరుతుందని వార్తలు వస్తున్నాయి.