కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఓటిమి పై గంభీర్ ఎమోషనల్!

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్డేడియం వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గెలుపొందింది. అయితే కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఘోరంగా ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌ తిలకించిన కోల్‌కతా జట్టు మాజీ కెప్టెన్‌, బీజేపీ ఎంపీ అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌ ఎమోషనల్ అయ్యాడు. రైడర్స్‌కు ఆయన తన మద్దతు తెలిపాడు. అంతటితో ఆగని ఆయన టీమ్‌కు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా గంభీర్ ఇలా రియాక్ట్ అయ్యారు.

గంభీర్ ట్వీట్ సారాంశం..

హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఇలా ఓటమిపాలవ్వడం నన్ను బాధించింది. డ్రెస్సింగ్‌రూమ్‌లో మంచి టాలెంట్‌ దాగుంది. కుర్రాళ్లంతా ఆత్మవిశ్వాసంతో ఆడి ప్రత్యర్థులను మట్టికరిపించాలి. మొదట వీలైనంత త్వరగా జట్టులో కూర్పు చెయ్యండి.. మనం చెయ్యగలం.. కచ్చితంగా సాధిస్తాం అంటూ టీమ్‌లో గౌతమ్‌ నూతనోత్సాహం నింపారు. కాగా కోల్‌కతా ఈ సీజన్‌లో మొదటి ఐదు మ్యాచుల్లో అన్నీ ఓడిపోయి ఆరోస్థానానికి పరిమితమైంది. గౌతమ్‌ ట్వీట్‌కు అభిమానులు, క్రీడా ప్రియులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. మరికొందరు నాటి గౌతమ్‌ ఆటను గుర్తు తెచ్చుకుంటున్నారు.

అదృష్టం పరీక్షించుకుంటున్న గంభీర్!

ఇదిలా ఉంటే.. 2018 డిసెంబర్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన గంభీర్ ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ తూర్పు నుంచి బీజేపీ తరఫున గంభీర్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట అని పేరుంది. అయితే ఫస్ట్ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న గౌతమ్‌‌కు విజయం వరించాలని క్రీడాభిమానులు, మిత్రులు కోరుకుంటున్నారు. కాగా ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున అరవిందర్‌ లవ్లీ బరిలో ఉన్నారు. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు మే 12న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

More News

దిగొచ్చిన టి. ఇంటర్ బోర్డ్.. విద్యార్థులకు గుడ్ న్యూస్

గత వారం రోజులుగా నానా ఇబ్బందులు పడుతున్న ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ చిన్నపాటి గుడ్ న్యూస్ అందించింది. రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్‌కు ఈ నెల 25 వరకూ బోర్డు గడువిచ్చిన సంగతి తెలిసిందే.

ఇండియాతో పాటు ఏడు దేశాలకు ‘ట్రంప్’ షాక్!

ఇండియాతో పాటు పలు దేశాలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. సోమవారం ట్రంప్ తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయంతో దేశాల అధిపతులు, ప్రధానులు కంగుతిన్నారు.

'ఎర్రచీర' మొదటి షెడ్యూల్‌ పూర్తి

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బేబి డమరి సమర్పించు హర్రర్‌ మదర్‌ సెంటిమెంట్‌ 'ఎర్రచీర'. సుమన్‌బాబు, కారుణ్య, కమల్‌ కామరాజు, భానుశ్రీ

హైదరాబాద్‌కు ఫ్లిప్‌కార్ట్ డాటా సెంటర్ వచ్చేసిందోచ్!

దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. ఇటీవల హైదరాబాద్‌లో డాటా సెంటర్‌ను ఆవిష్కరించింది. కాగా.. ఇది తెలంగాణలో మొదటిది కాగా..

పోలీసులూ మీకిది తగునా.. స్టూడెంట్స్‌పై ఏంటీ ప్రవర్తన!?

తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి విద్యార్థుల ఆందోళనలు, ఆత్మహత్యలతో అట్టుడుకుతోంది. ఓ వైపు తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు