గాంధీ ముని మనవరాలికి 7 ఏళ్ల జైలు శిక్ష.. రూ.3 కోట్ల చీటింగ్ చేసి.. 

  • IndiaGlitz, [Wednesday,June 09 2021]

జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవరాలు ఆశిష్ లతా రాంగోబిన్ కు దక్షిణాఫ్రికాలోని డర్బన్ న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమె చేసిన ఘరానా చీటింగ్ కేసు నిరూపితం కావడంతో కోర్టు జైలు శిక్ష విధించింది. 2015లోనే లతా రాంగోబిన్ పై సౌత్ ఆఫ్రికాలో కేసు నమోదైంది. కానీ అప్పట్లో ఆమె బెయిలుపై బయటకు వచ్చింది.

మహాత్మా గాంధీ మనవరాలు ఈలా గాంధీ కుమార్తె ఈ లతా రాంగోబిన్. దక్షిణాఫ్రికాలోని న్యూ ఆఫ్రికా అలియన్స్ అనే వస్త్రాలు, చెప్పులు వ్యాపారం చేసే కంపెనీని మోసం చేయడానికి ప్రయత్నించిన లతా ఈ చిక్కుల్లో చిక్కుకుంది. సదరు కంపెనీ ప్రాఫిట్ షేర్ ఒప్పందంలో ఇతరులకు రుణాలు కూడా ఇస్తూ ఉంటుంది.

ఆ కంపెనీ డైరెక్టర్ ఎస్ ఆర్ మహారాజ్ ని 2015లో లతా కలిశారు. తాను ఇండియా నుంచి మూడు లినెన్ కంటైనర్లు దిగుమతి చేసుకున్నానని మహారాజ్ కు తెలిపింది. అయితే ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల కారణంగా కస్టమ్స్ సుంకాలు చెల్లించలేకపోతున్నట్లు తెలిపింది. తనకు డబ్బు సాయం చేస్తే కంటైనర్లు హార్బర్ నుంచి తీసుకువచ్చి లాభాల్లో షేర్ ఇస్తానని తెలిపింది.

తాను లినెన్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసినట్లు పత్రాలు కూడా చూపించింది. దీనితో సదరు కంపెనీ ఆమెకు రూ 3.22 కోట్ల వరకు సాయం చేసింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె చూపించిన పత్రాలు నకిలీవి అని, ఆమె ఇండియా నుంచి ఎలాంటి దిగుమతులు చేసుకోలేదని తేలింది. దీనితో మహారాజ్ పోలీసులని ఆశ్రయించి ఆమెపై కేసు నమోదు చేయించాడు.

ఆమె చేసిన మోసం తేలడంతో కోర్టు నేడు తుదితీర్పు ఇస్తూ ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. తీర్పుపై ఆమె అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు.

More News

కిస్ సీన్ లో నటిస్తే అలాగే ఫీల్ కావాలి.. హీరోయిన్ కామెంట్స్

బాలీవుడ్ లో బ్యాడ్ లక్ వెంటాడిన హీరోయిన్లలో పరిణీతి చోప్రా ఒకరు. అందం, అభినయం ఉన్నప్పటికీ ఆమెకు అదృష్టం కలసి రాలేదు.

అషురెడ్డికి ముద్దిచ్చిన రాహుల్.. లవ్ అనౌన్స్మెంట్!

ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచాడు. ఆ సీజన్ లో శ్రీముఖి, రాహుల్ పోటాపోటీగా తలపడ్డారు.

ఒకే కాన్పులో 10 మంది పిల్లలు.. రికార్డు సృష్టించిన మహిళ!

ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతుంటాయి. ఎవరికైనా కవల పిల్లలు పుడితేనే ఆశర్యపోతుంటాం.

PSPK28: అలెర్ట్ అయిన టీమ్.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

వకీల్ సాబ్ చిత్రంతో పవర్ స్టార్ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఘనంగా జరిగింది. మునుపటిలాగే పవన్ వకీల్ సాబ్ లో పవర్ ఫుల్ గా కనిపించాడు.

అందాలన్నీ చూపిస్తూ కొంటెగా సాకు చెప్పిన హెబ్బా పటేల్

యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. హెబ్బా పటేల్ కు క్రేజ్ తీసుకువచ్చిన చిత్రం కుమారి 21ఎఫ్.