భారత్ వరల్డ్ రికార్డ్స్ లో గణేష్ మాస్టర్

  • IndiaGlitz, [Monday,November 27 2017]

ఢీ-2 టెలివిజన్ డాన్స్ షో విన్నర్, మా టీవీ అవార్డ్ గ్రహీత, భారత్ ఆర్ట్స్ అకాడెమీ ద్వారా గబ్బర్ సింగ్ అవార్డును గణేష్ మాస్టరు అందుకొన్నారు. సినీ కొరియోగ్రాఫర్ గా పలువురు స్టార్ హీరోలు .. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, వెంకటేష్, నాగార్జున, జూనియర్ యన్ టి ఆర్, రామ్, నితిన్, మంచు విష్ణు, అల్లరి నరేష్, నారా రోహిత్, నిఖిల్, ఆది, వరుణ్ సందేశ్, జగపతి బాబు, కళ్యాణ్ రామ్ తదితర హీరోలతో పని చేసారు.

ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు గారి ఆసీస్సులతొ ఒసెయ్ రాములమ్మా చిత్రంతొ కొరియోగ్రాఫర్ గా పరిచయం అయ్యారు తర్వాత సుకుమార్, త్రివిక్రమ్,హరీష్ శంకర్, గుణశేఖర్, వి వి వినాయక్, పూరి జగన్నాథ్ , కరుణాకరన్ , నాగేశ్వరరెడ్డి, సీనియర్ దర్శకులు ఈవివి సత్యనారాయణ వంటి దర్శకుల దగ్గర పలు చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసారు.

తాజాగా భారత్ వరల్డ్ రికార్డ్స్ ప్రతి ఏడాది అందించే బెస్ట్ టాలెంటెడ్ అవార్డ్ 2016-2017 కు గాను ప్రముఖ కొరియోగ్రాఫర్ ''గబ్బర్ సింగ్'' గణేష్ మాస్టారు కు దక్కింది.

సినీ మరియు టీవీ రంగాలలో అయన చేసిన కృషికి గుర్తింపుగా తెలంగాణా రాష్ట్రం తరపున గణేష్ మాస్టర్ కు బెస్ట్ టాలెంటెడ్ అవార్డు 2016-2017 ను మాజీ ముఖ్యమంత్రి , తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి.రోశయ్య, భారత్ వరల్డ్ రికార్డ్స్ ఇండియా ప్రతినిధి లయన్ డా..కె వి రమణారావు గార్ల చేతులమీదుగా నమోదు పత్రాన్నిఅందజేసారు. ఈ సందర్బంగా ఈ అవార్డు తనకు రావడం చాలా ఆనందంగా ఉందని గణేష్ మాస్టర్ తెలిపారు.

More News

ఇంకెన్ని స‌ర్‌ప్రైజ్‌లు ఇస్తాడో

'హలో’ సినిమాతో అఖిల్.. ప్రేక్షకులకు రోజుకొక సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ముందు టీజర్, ట్రైలర్లతో అలరించాడు. తర్వాత త‌ను చేసే పాత్ర అంటూ అవినాష్‌గా ప‌ల‌క‌రించాడు. అమ్మ నాన్న అంటూ రమ్యకృష్ణ, జగపతి బాబులను పరిచయం చేస్తూ ఒక పిక్ ని రిలీజ్ చేసాడు.

పాట పుట్టిన చోటే 'రచయిత' గీతావిష్కరణ

దుహర మూవీస్ సమర్పించు చిత్రం "రచయిత". ఈ చిత్ర ఆడియో విడుదల సోమవారం  హైదరాబాద్ మణికొండ లోని పాటల రచయిత చంద్రబోస్ నివాసం లో నటుడు జగపతిబాబు సమక్షంలో చంద్ర బోస్ పాడి వినిపించడం తో ఈ  ఆడియా విడుదల జరిగింది.

జ్యోతికి, బాలాపై కేసు...

సీనియర్ హీరోయిన్..హీరో సూర్య భార్య అయిన జ్యోతిక ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రీసెంట్గా నటించిన `మగళూర్ మట్టుమ్` తర్వాత.. బాల దర్శకత్వంలో `నాచియార్` సినిమా చేస్తుంది.

అజిత్ స‌ర‌స‌న..?

అజిత్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో నాలుగో సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు 'విశ్వాసం' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. వీరం, వేదాళం, వివేకం సినిమాల త‌ర్వాత అజిత్‌, శివ కాంబినేష‌న్‌లో రానున్న సినిమా.

సినిమాల్లోకి మ‌హేష్ మేన‌ల్లుడు

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు మేన‌ల్లుడు..తెలుగు దేశం పార్టీ పార్ల‌మెంట్ స‌భ్యుడు గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న‌యుడు గ‌ల్లా అశోక్ సినీ రంగ ప్ర‌వేశం చేయ‌నున్నారు.