కూకట్‌పల్లిలో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్..

  • IndiaGlitz, [Friday,October 16 2020]

హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. స్నేహం, ప్రేమ ముసుగులో యువతిని బర్త్ డే పార్టీకి రప్పించి గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌కు చెందిన యువతి(19) సికింద్రాబాద్‌లో డిగ్రీ చదువుతోంది. సదరు యువతి ఇంటికి దగ్గరలో ఉండే జోసెఫ్‌, రాము, నవీన్‌ అనే ముగ్గురు యువకులతో స్నేహం ఏర్పడింది. ఈ నెల 5న కాలేజ్ ఫీజు కట్టేందుకు వెళ్లిన యువతికి జోసెఫ్ నుంచి ఫోన్ వచ్చింది.

తన పుట్టినరోజని.. రాము, నవీన్ కూడా వస్తున్నారంటూ ఆమెను కూడా జోసెఫ్ ఆహ్వానించాడు. కాలేజ్ నుంచి అటు నుంచి అటే జోసెఫ్ చెప్పిన హోటల్ వద్దకు వెళ్లింది. బిర్యాని పార్శిల్ తీసుకుని ట్యాంక్‌బండ్‌కు వెళ్లి కాసేపు సరదాగా గడిపారు. మధ్యాహ్నం కూకట్‌పల్లిలోని ఓ లాడ్జికి వెళ్లారు. నవీన్ కేక్ తీసుకొస్తానని వెళ్లాడు. ముందుగానే ప్లాన్ ప్రకారం మత్తు మందు చల్లి తీసుకొచ్చాడు. ప్లాన్ ప్రకారం కేక్‌ను యువతికి తినిపించారు. దీంతో యువతి మత్తులోకి వెళ్లిపోయింది. ఆపై ముగ్గురూ ఆమెపై అత్యాచారం జరిపారు

విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని యువతిని బెదిరించారు. తరువాత బాధితురాలిని ఆటోలో ఇంటికి పంపించారు. ఆ రోజు నుంచి బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. కాగా.. ఈ నెల 11న అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితురాలిని తల్లిదండ్రులు నిలదీసి అడగడంతో అసలు విషయం వెల్లడించింది. దీంతో తల్లిదండ్రులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

More News

ఆకట్టుకునే పిక్స్.. కదిలించే సంఘటనలు..

మెగాస్టార్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. అవినాష్‌కి మోనాల్ టిఫిన్ తినిపిస్తుంటే... అమ్మ రాజశేఖర్ సెటైర్లు చాలా ఫన్నీగా అనిపించాయి.

బార్క్ కీలక నిర్ణయం.. 12 వారాల పాటు రేటింగ్స్ నిలిపివేత..

బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసర్చ్ కౌన్సిల్(బార్క్) కీలక నిర్ణయం తీసుకుంది. వీవర్ షిప్ ఆధారంగా టెలివిజన్ ఛానెల్స్‌కు రేటింగ్ ఇచ్చే ప్రక్రియను ఏకంగా 12 వారాలపాటు

రేపే కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం..

విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానుంది.

‘వేదాళం’ సినిమాకు ముహూర్తం కుదిరింది..!

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య‌’ సినిమా పూర్తి కానేలేదు . కానీ.. త‌దుప‌రి రెండు సినిమాల‌ను ఆయ‌న లైన్‌లో పెట్టారు.

ఇంటికి చేరుకున్న తమన్నా...

తమన్నా ఇంటికి చేరుకోవడమేంటి? అనే సందేహం కలుగక మానదు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైన ఈ మిల్కీబ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో