5 రోజుల్లో రూ.15 కోట్ల‌కి పైగా వ‌సూళ్ళ‌ను రాబ‌ట్టుకున్న'పిఎస్‌వి గ‌రుడ‌వేగ'

  • IndiaGlitz, [Thursday,November 09 2017]

ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌ల‌కు పెట్టింది పేరైన డా.రాజ‌శేఖ‌ర్ ఎన్.ఐ.ఎ ఆఫీస‌ర్‌గా న‌టించిన చిత్రం 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'. టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌ ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బేన‌ర్‌పై ఎం.కోటేశ్వ‌ర్ రాజు నిర్మించారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 3న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌ని తెచ్చుకుంది. అంతేకాకుండా స‌క్సెస్‌ఫుల్ గా ర‌న్ అవుతూ.. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తూ రెండో వారంలో దిగ్విజ‌యంగా అడుగుపెడుతోంది.

ఈ సంద‌ర్భంగా.. చిత్ర నిర్మాత ఎం.కోటేశ్వ‌ర్ రాజు మాట్లాడుతూ - "నేను నిర్మాత‌గా చేసిన తొలి సినిమా 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం' సెన్సేష‌న‌ల్ హిట్ అవ్వ‌డం చాలా ఆనందంగా ఉంది. సినిమా టీజ‌ర్ విడుద‌లైన‌ప్ప‌టినుంచి సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌ను మించుతూ సినిమా స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది.

డా.రాజ‌శేఖ‌ర్ గారి అద్భుత‌మైన పెర్‌ఫార్మెన్స్‌, ప్ర‌వీణ్ స‌త్తారు గారి ఎక్స్ ట్రార్డ‌న‌రీ టేకింగ్, సినిమాలోని ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల స‌హ‌కారం సినిమాని నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లాయి. ఐదు రోజుల్లో రూ.15 కోట్ల‌కిపైగా వ‌సూళ్ళ‌ను రాబ‌ట్టుకున్న మా సినిమా.. రెండో వారంలోకి అడుగుపెడుతున్న‌ప్ప‌టికీ ఆద‌ర‌ణ అంత‌కు అంత‌గా పెరుగుతోంది.

రెండో వారంలో కూడా థియేట‌ర్ల సంఖ్య పెర‌గ‌డ‌మే సినిమాకి పెరుగుతున్న ఆద‌ర‌ణ‌కు సాక్ష్యం. ఇంత‌టి ఘ‌న‌విజ‌యాన్ని అందించిన తెలుగు ప్రేక్ష‌కులంద‌రికీ మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు" అని తెలిపారు.

More News

అస‌భ్య‌క‌రంగా ఉండ‌దంటున్నమేక‌ర్‌

అల్లా వుద్దీన్ ఖిల్జీకి, రాణి ప‌ద్మావ‌తికి మ‌ధ్య ఎలాంటి అస‌భ్య‌క‌ర‌మైన స‌న్నివేశాల‌నూ చిత్రీక‌రించ‌లేద‌ని, త‌నను రాణి ప‌ద్మావ‌తి క‌థ ఎంతో ఇన్‌స్ప‌యిర్ చేయ‌బ‌ట్టే ఈ సినిమాను చేశాన‌ని అంటున్నారు ఆ చిత్ర ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలి.

త‌రుణ్ తాజా విశేషాలు

'పెళ్లిచూపులు' సినిమా పేరు చెప్ప‌గానే అందులో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు ఎంత మందికి గుర్తుకొస్తుందో, ఆ చిత్ర ద‌ర్శ‌కుడిగా త‌రుణ్ భాస్క‌ర్ పేరు అంతే మందికి గుర్తొస్తుంది.

అనుష్క ప్రేమించింది అత‌న్నే!

త‌ను ప్రేమించిన వ్య‌క్తి గురించి స్వీటీ అనుష్క బాహాటంగానే చెప్పింది. ఒకానొక స‌మ‌యంలో ఆమె అత‌ని ప్రేమ‌లో పీక‌ల్లోతు కూరుకుపోయిన విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించింది.

హిట్ డైరెక్ట‌ర్‌తో అనీషా....

గోపాల గోపాల‌, ర‌న్ వంటి చిత్రాల్లో మెప్పించిన హీరోయిన్ అనీషా అంబ్రోస్‌..హీరోయిన్‌గా మ‌రో చిత్రంలో ఎంపికైంది.

మారుతి కొత్త ప్లాన్‌...

డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌కత్వం వైపే కాకుండా నిర్మాణ రంగంలో కూడా త‌న‌దైన రీతిలో రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. మారుతి టాకీస్ అనే బ్యాన‌ర్‌ను స్థాపించి, త‌న శిష్యుల‌కు ద‌ర్శ‌కులుగా అవ‌కాశం ఇస్తూ వ‌స్తున్నాడు.