విశాఖ: ఎల్జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం.. జనం పరుగులు

  • IndiaGlitz, [Thursday,May 07 2020]

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఇవాళ తెల్లారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని గోపాలపట్నం వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌లో నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున గ్యాస్ లీకయ్యింది. ఆ రసాయనాల వాసనకి కళ్ళు మంట, కడుపులో వికారంతో తీవ్ర ఇక్కట్లు పడ్డారు. కొందరికీ ఒళ్లు దురదలు కూడా పుట్టాయ్.సుమారు మూడు కిలోమీటర్ల మేర ఈ గ్యాస్ వ్యాపించిపోయింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎల్జీ పాలిమర్స్, ఆర్ఆర్ వెంకటాపురం పరిసరాల్లో ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మేఘాద్రి గడ్డ వైపు కూడా ప్రజలు పరుగులు తీస్తున్నారు. మరికొందరు సింహాచలం వైపు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైనవారిని ఆస్పత్రికి తరలించేందుకు భారీగా అంబులెన్స్‌లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

ముగ్గురు మృతి.. 200 మందికి అస్వస్థత

వైపు కెమికల్ పీల్చిన జనాలు ఎక్కడికక్కడ రోడ్ల మీద అలానే పడిపోతున్నారు. మొత్తం మూడు కిలోమీటర్ల మేర రసాయన వాయివు వ్యాపించేసింది. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న కేజీహెచ్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. వీరిలో చికిత్సపొందుతూ ముగ్గురు మృతి చెందారు. అందులో ఓ చిన్నారి కూడా ఉండటం బాధాకరమైన విషయం. చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. వీరంతా ప్రస్తుతం పలు ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు. పాలిమర్స్‌ బాధితులతో కేజీహెచ్‌ నిండిపోయింది. ఒక్కో బెడ్‌పై ముగ్గురు చొప్పున చిన్నారులకు వైద్యం అందిస్తున్నారు. అంబులెన్స్‌లు, వ్యాన్లు, కార్లలో బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.

కళ్లు కనిపించక..

విషవాయువు ప్రభావంతో కళ్లు కనపడక బావిలో పడి ఒకరు మృతి చెందారు. వెంకటాపురంలో పెద్దఎత్తున పశువులు కూడా మృత్యువాత పడ్డాయి. చెట్లు అయితే మాడిపోవడం గమనార్హం. కాగా ఘటనాస్థలికి వచ్చిన పలువురు పోలీసులు కూడా అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ ఘటనను పరిశీలించడానికి జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్, డీసీపీ ఉదయ్‌భాస్కర్‌ సందర్శించారు. అయితే రసాయనాలు థాటికి ఉదయ్ భాస్కర్ కూడా అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి అదుపులోకి వచ్చేందుకు మరికొన్ని గంటలు పడుతుందని అధికారులు చెబుతున్నారు.

అసలేం జరిగింది..!?

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వినయ్ చందన్ మీడియాతో మాట్లాడారు. పరిస్థితి అదుపులోకి రావడానికి మరో 2 గంటలు పట్టొచ్చని తెలిపారు. సుమారు 200 మంది అస్వస్థతకు గురై ఉంటారన్నారు. యంత్రాలను ప్రారంభించే సమయంలో మంటలు వచ్చాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే 20 మందికి పైగా మృతి చెందారని.. ఈ ఘటన 5:45 గంటల ప్రాంతంలో జరిగిందని తెలుస్తోంది. క్షణాల్లోనే 7 కిలోమీటర్ల మేర రసాయనాలు వ్యాపించేశాయని సమాచారం. ప్రస్తుతం పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని.. ఇది చాలా డేంజర్ పరిస్థితి అని తెలియవచ్చింది. ఇది మానవ తప్పిదమే అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎలా జరిగింది..? ఏంటి..? అనే విషయాలు మాత్రం పూర్తిగా తెలియరాలేదు.

More News

మద్యం అమ్మకాల్లో ఆంధ్రా రికార్డ్ బద్ధలు కొట్టిన తెలంగాణ!

లాక్ డౌన్ 3.0 విధించిన అనంతరం కేంద్రం కొన్ని సడలింపులు చేసిన విషయం విదితమే. ఇందులో మద్యం అమ్మకాలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తరుణంలో

ఏపీ పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్‌లోని పాలనా యంత్రాంగంలో కీలక మార్పులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టూరు. ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో సీట్లు దక్కించుకుని సీఎంగా

మ‌రోసారి పాక‌శాస్త్రంలో మోహ‌న్‌బాబు ప్రావీణ్య‌త‌

కరోనా ఎఫెక్ట్ వ‌ల్ల లాక్‌డౌన్‌ను విధించాయి ప్ర‌భుత్వాలు. దీంతో సినీ సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. షూటింగ్స్ అన్నీ ర‌ద్ద‌యిపోవ‌డంతో ఎప్పుడూ షూటింగ్స్,

నిన్న కేసీఆర్.. ఇవాళ హరీష్.. కేంద్రంపై యుద్ధం!?

కేంద్ర ప్రభుత్వంపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పీకల్లోతు కోపంతో ఊగిపోతున్నాయి. ఇప్పటికే మానిటోరియం, కేంద్రం చేతుల్లోకి కరెంట్, ఎఫ్ఆర్‌బీఎమ్‌, వలస కార్మికుల తరలింపుతో పాటు పలు విషయాల్లో కేంద్రం

టిక్‌టాక్‌లోకి విష్ణు ఎంట్రీ

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా గురించి తెలియ‌నివాడు లేదు. ప్ర‌తి మనిషి జీవితంలో సోష‌ల్ మీడియా ఏదో ర‌కంగా భాగ‌మైంది. ఇక సెల‌బ్రిటీల సంగ‌తి చెప్ప‌న‌క్క‌ర్లేదు.