ప‌వ‌న్ వ‌ల్లే 'జార్జిరెడ్డి' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ క్యాన్సిల్‌

  • IndiaGlitz, [Sunday,November 17 2019]

ఉస్మానియా కాలేజీ విద్యార్థి నాయ‌కుడు జార్జ్‌రెడ్డి జీవిత క‌థ‌ను ఆధారం చేసుకుని తెర‌కెక్కిన చిత్రం 'జార్జి రెడ్డి'. న‌వంబ‌ర్ 22న సినిమా విడుద‌ల కానుంది. 'ద‌ళం' ఫేమ్ జీవ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. న‌వంబ‌ర్ 17న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను నిర్వ‌హించాల‌ని చిత్ర యూనిట్ నిర్ణ‌యించింది. ఈ వేడుక‌కి జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. రావ‌డానికి ఆయ‌న అంగీక‌రించిన‌ట్లు యూనిట్ తెలిపింది అయితే చివ‌రి నిమిషంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు ప‌ర్మిష‌న్‌ను నిరాక‌రించిన‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ప‌లువురు కాలేజీ విద్యార్థుల్లో పోరాట ప‌టిమ‌ను ర‌గిల్చిన విద్యార్థి నాయ‌కుడు జార్జి రెడ్డి బ‌యోపిక్ కావ‌డంతో పాటు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి స్టార్ హీరో ఇలాంటి సినిమా ప్రీరిలీజ్‌కు వ‌స్తే ఎక్కువ సంఖ్య‌లో యూత్ హాజ‌ర‌వుతారు. త‌ద్వారా లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని భావించిన పోలీసులు ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లాంటి స్టార్ హీరో త‌మ సినిమా వేడుక‌కి వ‌స్తే బిజినెస్ ప‌రంగా ప్ల‌స్ అవుతుంద‌ని భావించిన చిత్ర యూనిట్‌కి చివ‌రి నిమిషంలో నిరాశే మిగిలింది.

More News

కీర్తిసురేష్ ఎమోష‌నల్ పోస్ట్‌

ద‌క్షిణాది సినిమాల‌తో ఆక‌ట్టుకున్న హీరోయిన్ కీర్తిసురేశ్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టిస్తుంది.

రాజ‌కీయాల్లోకి వ‌స్తానంటున్న శ్రీరెడ్డి

క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారంలో తెలుగు సినిమాల్లో ప్ర‌ముఖంగా విన‌ప‌డిన పేరు శ్రీరెడ్డి.

బోయపాటి శ్రీను చేతుల మీదుగా 'రాజా నరసింహ' థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ

రాజా చెప్పిందే చేస్తాడు.. చేసేది మాత్రమే చెప్తాడు!  ''అదొక మారుమూల అటవీ ప్రాంతం.

'90ml'  'సింగిలు సింగిలు' పాట సుజనా మాల్ లో విడుదల

హీరో కార్తికేయ నటించిన 90ml 'సింగిలు సింగిలు' పాటని భారీ జనసందోహం మధ్య ఫోరమ్ సుజనా మాల్ లో 17 నవంబర్ శనివారం రాత్రి హైదరాబాద్ విడుదల చేశారు.

'పిచ్చోడు' నవంబర్ 22న విడుదల

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా పిచ్చోడు.