ఆన్‌లైన్‌లోకి సమంత... ఏం బాంబు పేలుస్తారో, ఈ రోజు సాయంత్రం రెడీగా ఉండండి..!

  • IndiaGlitz, [Tuesday,September 28 2021]

సమంత.. సమంత.. సమంత.. ప్రస్తుతం సోషల్ మీడియాలో, తెలుగు చిత్ర సీమలో ఎక్కడ చూసినా ఈమే పేరే గట్టిగా వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కినేని వారి కోడలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నో ఏళ్ల పాటు ప్రేమను కొనసాగించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న సామ్, చైతన్య జంట విడాకులు తీసుకోబోతున్నారనే వార్త ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయమై అక్కినేని ఫ్యామిలీ కానీ సమంత సన్నిహిత వర్గాలు కానీ నోరు విప్పకపోవడంతో నిప్పులేనిదే పొగ రాదన్న చందంగా వ్యవహారం తయారైంది. కానీ వీరి రిలేషన్‌పై మాత్రం గాసిప్పులు ఆగడం లేదు.

ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ‘బుద్ది ఉందా.?’ అని బదులిచ్చిన నాటి నుంచి సమంత టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం ఈ చెన్నై చిన్నది సోషల్‌ మీడియాలో ఏ చిన్న పోస్ట్‌ చేసినా అది వైరల్ అయి కూర్చొంటోంది. మరోవైపు తన వైవాహిక జీవితానికి సంబంధించి ఎలాంటి వార్తలు వస్తున్నా వాటన్నింటినీ పట్టించుకోని సమంత ప్రస్తుతం చెన్నైలో స్నేహితులతో ఎంజాయ్‌ చేస్తోంది.

ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ చేసింది సామ. ఈ రోజు (సెప్టెంబర్‌ 28) సాయంత్రం 5 గంటలకు తాను ఆన్‌లైన్‌లోకి రానున్నట్లు తెలిపింది. ఇక ఉదయం 11 గంటలకు ‘వన్‌ విత్‌ సాకీ’ని సమంత ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటుందో ఐజీ స్టోరీలో అడగండి అంటూ ఓ పోస్ట్‌ చేసింది. మరి సమంతను అభిమానులు ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారు.? చైతో బ్రేకప్ గురించే ఎక్కువగా ప్రశ్నలు వుంటాయా..? అందుకు తగ్గట్లుగానే సామ్ ముందే ప్రిపేర్ అయ్యారా..? లేకపోతే ఈ పుకార్లకు ఒకే ఒక్క లైవ్‌తో చెక్ పెట్టేయాలని అనుకుంటున్నారా..? ఏం జరగనుందో తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. ఇక సినిమాల విషయానికొస్తే సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. వీటితో పాటు తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది. విజ్ఞేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తుండడం విశేషం

More News

'వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే' : పోసానికి తన స్టైల్లో కౌంటరిచ్చిన పవన్

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌‌లో పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఏపీలోని వైఎస్ జగన్‌ సర్కార్‌‌పై చేసిన వ్యాఖ్యలు..

బిగ్‌బాస్ 5 తెలుగు: ముగ్గురికి రవి క్షమాపణలు... ప్రియపై రంకేలేసిన లోబో, ఈవారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే

బిగ్‌‌బాస్ 5 తెలుగు విజయవంతంగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. నిన్న లహరి ఎలిమినేషన్‌తో

తనిష్క్ రెడ్డి సమర్పిస్తోన్న ఏ.వి క్రియేటివ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ ‘ప్రొడక్షన్ నెం.1’ చిత్రం ప్రారంభం

తనిష్క్ రెడ్డి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఏ.వి క్రియేటివ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై తనిష్క్ రెడ్డి, అంకిత సాహు హీరోహీరోయిన్లుగా

ఆది సాయి కుమార్ ‘అతిధి దేవో భవ’ నుండి  ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’ పాట విడుద‌ల‌

ఆది సాయి కుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘అతిధి దేవో భవ’.  శ్రీనివాస క్రియేషన్స్ ప‌తాకంపై

‘కొండపొలం’ ట్రైలర్ విడుదల

ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం `కొండపొలం`తో మరోసారి అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు.