close
Choose your channels

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీని వీడిన గులాం నబీ ఆజాద్, వెళ్తూ వెళ్తూ రాహుల్‌పై విమర్శలు

Friday, August 26, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి. రాష్ట్రాల్లో సీనియర్ నేతల కుమ్ములాటలు, ఈడీ, సీబీఐ కేసులతో అల్లాడుతోన్న కాంగ్రెస్ అధిష్టానానికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ కురు వృద్ధుడు, సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ కాంగ్రెస్‌ను వీడారు. పార్టీకీ, అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన శుక్రవారం అధిష్టానానికి లేఖ రాశారు. తన నాలుగు పేజీలో లేఖలో పార్టీ ప్రస్తుత దుస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆజాద్ సుతిమెత్తని విమర్శలు చేశారు. మేధోమథనంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం లేదని, కనీసం వాటిని పరిశీలించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గులాంనబీ ఆజాద్ మండిపడ్డారు.

ఒకప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ రాను రాను తన ప్రాభవాన్ని కోల్పోతుండటంతో అందుకు గల కారణాలపై 23 మంది అసమ్మతి నేతలు తరచుగా ప్రశ్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆజాద్ కూడా ఒకరు. 2019 సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి పార్టీ పరిస్ధితి మరింత దిగజారుతోందని ఆజాద్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ను రాహుల్ ఆయన కోటరీయే నడిపిస్తోందని.. సోనియా గాంధీ పాత్ర నామమాత్రమేనని ఆజాద్ ఆరోపించారు,

ఇదీ ఆజాద్ ప్రస్థానం :

1973లో సాధారణ బ్లాక్ కాంగ్రెస్ సెక్రటరీగా ఆజాద్ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత రెండేళ్లకే జమ్మూకాశ్మీర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అనంతరం తన పనితీరుతో పెద్దల దృష్టిలో పడ్డ ఆయన.. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తర్వాత 1980 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని వాశీమ్ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1982లో కేంద్ర సహాయ మంత్రిగా గెలిచారు. 1984లో మరోసారి ఎంపీగా గెలిచిన ఆయన.. 1990 నుంచి 1996 వరకు రాజ్యసభ సభ్యుడిగా పీవీ నరసింహారావు కేబినెట్‌లో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి 2008 వరకు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఆజాద్ నియమితులయ్యారు. తర్వాత మన్మోహన్ సింగ్ సెకండ్ కేబినెట్‌లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభలో ప్రతిపక్షనేతగా పనిచేశారు ఆజాద్. 2015లో మరోసారి జమ్మూకాశ్మీర్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.