ఆ కల నిజం చేసుకుంటున్నాం.. తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కు శుభాకాంక్షలు: రామ్ చరణ్

  • IndiaGlitz, [Friday,June 02 2023]

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ వ్యవహారంపై ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో అన్ని రంగాల్లో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించింది. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, బంగారు తెలంగాణ కల నిజం చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా.. తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌ అందరికీ నా శుభకాంక్షలు ’’ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.

తెలంగాణ కీర్తి అజరామరమన్న పవన్ కల్యాణ్:

అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నేటి నుంచి 22వ తేదీ వరకు సాగే ఈ దశాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకమైనవి. ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. అటువంటి త్యాగధనులందరికీ నివాళులు అర్పిస్తున్నాను. పేదరికం లేని తెలంగాణా ఆవిష్కృతం కావాలనీ, రైతులు, కర్షకులు, కార్మికులతోపాటు.. ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం సాగించాలని కాంక్షిస్తూ.. తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నాను ’’ అంటూ పవన్ పేర్కొన్నారు.

శంకర్ దర్శకత్వంలో నటిస్తోన్న చరణ్:

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 170 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సల్మాన్, వెంకీలతో చరణ్ స్టెప్పులు:

అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’’ చిత్రంలో చరణ్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. తెలుగు అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేశ్ సైతం కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాలో సల్మాన్, వెంకటేష్‌లతో కలిసి చరణ్ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ‘‘ఏంటమ్మా’’ అంటూ సాగే పాటలో లుంగీ కట్టి మాస్ లుక్‌లో ఇరగదీశాడు మన గ్లోబల్ స్టార్.

More News

ఎందరో పోరాట యోధుల త్యాగ ఫలం.. తెలంగాణ కీర్తి అజరామరం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Bholaa Shankar: 'భోళా శంకర్' - భోళా మానియా ఫస్ట్ లిరికల్ జూన్ 4న

వాల్తేరు వీరయ్య విజయంతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్

Vyuham: ఏపీ రాజకీయాలపై వర్మ 'వ్యూహం' .. వైఎస్ భారతిగా నటించేది ఈమె..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను టార్గెట్ చేస్తూ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘‘వ్యూహం’’. ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితం, ఆయన పొలిటికల్ ఎంట్రీ తదితర అంశాల ఇతివృత్తంతో

GDP: ఇండియాలో జీడీపీ వృద్ధిరేటు పరుగులు.. సవాళ్ల మధ్య అసాధారణ ఫలితాలు, నిపుణులు ఏమంటున్నారంటే..?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ధిక మాంద్యపు భయాలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. దిగ్గజ కంపెనీలన్నీ కాస్ట్ కాటింగ్ పేరుతో ఇప్పటికే ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

Vyooham: ఆర్జీవీ కొత్త సినిమా 'వ్యూహం': బయోపిక్ కాదు, రియల్‌ పిక్ అంట.. ఎవరినీ టార్గెట్ చేశారో..?

సమకాలీన అంశాలు, రాజకీయాలను ఆధారంగా చేసుకుని సినిమాలు చేయడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మది విలక్షణమైన శైలి. ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు రుజువు చేసుకున్నారు.