close
Choose your channels

అబ్బే నేను వైసీపీలోకి వెళ్లట్లేదు.. మా వాళ్లు వెళ్తున్నారు..!

Monday, December 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అబ్బే నేను వైసీపీలోకి వెళ్లట్లేదు.. మా వాళ్లు వెళ్తున్నారు..!

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి అమిత్‌షాకు అత్యంత సన్నిహితుడు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఆ పార్టీకి టాటా చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని గత 24గంటలుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తతో అటు ఏపీ.. ఇటు ఢిల్లీ రాజకీయాల్లో పెద్ద చర్చే జరిగింది. ఈ వ్యవహారంపై ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చేసుకున్నారు. ‘నేను పార్టీ మారుతున్నట్లు‌ వస్తున్న వార్తల్లో‌ ఎలాంటి వాస్తవం లేదు. నా గురించి తెలియకుండా మీడియా ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. నా కుమారుడు, నా సోదరులు వైసీపీలోకి‌ మాత్రమే వైసీపీలోకి వెళ్తున్నారు కానీ.. నేను వెళ్లట్లేదు. మా‌ కుమారుడు రంగరాజు.. సీఎం వైఎస్‌ జగన్‌కు మిత్రుడని.. 2019 ఎన్నికల్లోనే టీడీపీ, వైసీపీలు మా బాబుకు ఎంపీ సీటు ఆఫర్ చేశారు’ అని గోకరాజు స్పష్టం చేశారు.

అయితే తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని తెలిపారు. కాగా తాను, తన సోదరులు కాంగ్రెస్‌కు అత్యంత సన్నిహితులమని.. వైఎస్ టైమ్‌లో కాంగ్రెస్‌లో పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఆ‌ పరిచయాలతో ఇప్పుడు జగన్ సమక్షంలో రంగరాజు, గోకరాజు రామరాజు, నరసింహరాజులు వైసీపీలో చేరుతున్నారని గోకరాజు మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షాకు గోకరాజు అత్యంత సన్నిహితుడు అనే విషయం తెలిసిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.