దిలీపన్ - అంజలి కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం 'గోలీసోడా'

  • IndiaGlitz, [Sunday,September 11 2016]

దిలీపన్‌, అంజలి హీరోహీరోయిన్లుగా ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌ సమర్పణలో ఎ.ఆర్‌. మురుగదాస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై పి. కిన్‌స్లిన్‌ దర్శకత్వంలో ఎ.ఆర్‌. మురుగదాస్‌ నిర్మించిన చిత్రం 'వత్తికుచ్చి'. తమిళ్‌లో సూపర్‌డూపర్‌ హిట్‌ అయిన ఈ చిత్రాన్ని శ్రీ జె.వి. ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి లతా మార్టోరి సమర్పణలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌ వెంకట్రావ్‌ మార్టోరి 'గోలీసోడా' పేరుతో తెలుగులో ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈనెలలోనే రిలీజ్‌కి రెడీ అవుతోంది.
యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరి!!

నిర్మాత వెంకట్రావ్‌ మార్టోరి మాట్లాడుతూ - ''ఎ.ఆర్‌. మురుగదాస్‌ శిష్యుడు కిన్‌స్లిన్‌ దర్శకత్వంలో మురుగదాస్‌ సోదరుడు దిలీపన్‌ని హీరోగా ఇంట్రడ్యూస్‌ చేస్తూ మురుగదాస్‌ తమిళంలో నిర్మించిన 'వత్తికుచ్చి' చిత్రం సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది. ఈ చిత్రంలో దిలీపన్‌ అద్భుతంగా నటించాడు. అలాగే అంజలి డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో ఎక్స్‌లెంట్‌ పెర్‌ఫార్మ్‌ ప్రదర్శించింది. యువ సంచలన సంగీత దర్శకుడు జిబ్రాన్‌ అందించిన సంగీతం సూపర్‌హిట్‌ అయ్యింది. యూత్‌, లవ్‌, ఫ్యామిలీ, సెంటిమెంట్‌తో పాటు అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఈ చిత్రంలో ఉన్నాయి. రియలిస్టిక్‌ ఇన్సిడెంట్స్‌ని బేస్‌ చేసుకొని నేచురాలిటీకి దగ్గరగా ఈ చిత్రం వుంటుంది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలూ ఈ చిత్రంలో వున్నాయి. డబ్బింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసి, సెప్టెంబర్‌ నెలాఖరులో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

More News

అమెరికాలో 'ద్వారక' పాటలు విడుదల

సూపర్ గుడ్ ఫిలింస్(ఆర్.బి.చౌదరి ) సమర్పణలో లెజెండ్ సినిమా బ్యానర్ పై శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో ప్రద్యుమ్న,గణేష్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'ద్వారక'.

మోహన్ బాబు 40 నట వసంతాల వేడుకలో విశేషాలు...

సాధారణ వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతి శిఖరాలను అధిరోహించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అభిమాన నటుడయ్యారు.

'ఓం నమోవేంకటేశాయ' ఓవర్ సీస్ రైట్స్ ఎంతంటే....

అక్కినేని నాగార్జున టైటిల్ ప్రాతలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృపా ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి బ్యానర్ పై

విష్ణు మంచు 'లక్కున్నోడు' ప్రారంభం

'ఈడోరకం-ఆడోరకం' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా,బబ్లీ బ్యూటీ హన్సిక హీరోయిన్ గా ఎం.వి.వి.సినిమా బ్యానర్ పై గీతాంజలి,త్రిపుర వంటి హర్రర్ ఎంటర్ టైనర్స్ ను తెరకెక్కించిన దర్శకుడు రాజ్ కిరణ్

స్టైలిష్ పోలీస్ గా మహేష్...

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.