అలీకి గుడ్ న్యూస్.. పవన్ నుంచి పిలుపు..!?

  • IndiaGlitz, [Monday,February 03 2020]

అవును మీరు వింటున్నది నిజమే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుంచి కమెడియన్ కమ్ వైసీపీ నేత అలీకి పిలుపు పోయిందట. అదేంటి కొంపదీసి ఆయన్ను జనసేనలో చేర్చుకోవాలని పవన్ ఫిక్స్ అయ్యారా ఏంటి..? నిజంగానే అలీ కూడా ఒప్పుకున్నారా..? ఇదేంటి మళ్లీ పవన్-అలీ మళ్లీ ఒక్కటవుతున్నారా..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే పవన్-కమెడియన్ ఒక్కటవుతున్నారు కానీ రియల్ లైఫ్‌లో కాదండోయ్ బాబూ.. రీల్ లైఫ్‌లో ఇంతకీ ఆ కథేంటో తెలుసుకోవాలంటే www.indiaglitz.com అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం చదవాల్సిందే మరి.

ఒక్కటవుతున్నారు!?
పవన్ సినిమాల్లో నాటి నుంచి ఖుషీ నుంచి నిన్నగాక మొన్నవచ్చిన ‘అజ్ఞాతవాసి’ వరుకు దాదాపు అన్నింటిలో అలీ నటించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల తర్వాత పవన్ జనసేన పార్టీతో బిజిబిజీగా ఉండటం.. అలీ మాత్రం వైసీపీ జెండా పట్టుకున్నారు. అంతేకాదు.. వీరిద్దరూ ప్రాణ స్నేహితులు.. కానీ ఎన్నికలకు ముందు మాత్రం ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు కూడా. దీంతో వీరిద్దరి మధ్య లాంగ్ గ్యాప్ వచ్చేసింది. అలా రాజకీయాల పరంగా దూరమైన ఈ ఇద్దరు మిత్రులు.. మళ్లీ రీల్ ద్వారా ఒక్కటి కాబోతున్నారు.

పిలిచి మరీ..!
పవన్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. వీటిలో ‘పింక్’ రీమేక్ ఒక్కటి కాగా.. మరొకటి క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా ఉంది. మైత్రీ మూవీస్‌ కూడా ఇప్పటికే పవన్‌తో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా కూడా హరీశ్ శంకర్-పవన్ కాంబోలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ రేంజ్ సినిమా ఉంటుందట. అయితే.. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో.. హరీశ్ మూవీలో అలీ నటించబోతున్నాడని తెలుస్తోంది. పవన్ ఈ ఇద్దరు దర్శకులను పిలిచి మరీ అలీని తీసుకోవాలని సూచించారట. అంటే అలీకి పిలిచి మరీ పవన్ గుడ్ న్యూస్ అందించారన్న మాట. సో.. రాజకీయాల పరంగా విబేధించిన మిత్రులు.. సినిమాలతో ఒక్కటవుతున్నారన్న మాట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి ఉండాల్సిందే.

More News

RIP అంటూ హీరోయిన్‌పై శ్రీరెడ్డి సంచలన పోస్ట్!

టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి మరోసారి వార్తల్లో నిలిచింది. నిత్యం వివాదాలే ఊపిరిగా బతుకుతున్న శ్రీరెడ్డి ఎవర్ని పడితే వార్ని గోకుతూ హడావుడి చేస్తుంటుంది.

కాజ‌ల్ కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తుంద‌ట‌...!

టాలీవుడ్‌లో 12 ఏళ్ల క్రితం `ల‌క్ష్మీక‌ళ్యాణం` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి అనారోగ్యం పాలయ్యారు. ఆదివారం రాత్రి అస్వస్థతకు గురవ్వడంతో హుటాహుటిన ఆమె ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రికి తరలించారు.

భీమవరం అమ్మాయిని పెళ్లాడబోతున్న నిఖిల్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. భీమవరం అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. డాక్టర్ పల్లవితో కలిసి నిఖిల్ ఏడు అడుగులు వేయబోతున్నాడు.

'భీష్మ' ఫిబ్రవరి 21 న విడుదల

నితిన్,రష్మిక మందన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై