పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్...

  • IndiaGlitz, [Thursday,January 07 2021]

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. పవన్ మూడేళ్ల గ్యాప్ తర్వాత చేసిన సినిమా ‘వకీల్‌సాబ్’. ఈ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి. ‘వకీల్ సాబ్’ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హిందీలో మంచి విజయం సాధించిన ‘పింక్’ సినిమాకు రీమేక్‌‌గా ఈ సినిమా రూపొందుతోంది. నివేదా థామస్, అంజలి,శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో దీనికి సంబంధించి ఎటువంటి అప్‌డేట్‌ వచ్చినా.. సోషల్‌ మీడియాలో టాప్‌ లేపుతోంది.

తాజాగా ‘వకీల్ సాబ్’ నుంచి అభిమానులకు ఓ గుడ్‌ న్యూస్‌ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 6:03 గంటలకు విడుదల చేయబోతోన్నట్లుగా చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. దీంతో పవర్ స్టార్ అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో హడావుడి మొదలు పెట్టేశారు. కాగా.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన పవన్.. తన తదుపరి చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ పూర్తై పోవడంతో ఇక తర్వాతి అప్‌డేట్స్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా.. ‘వకీల్ సాబ్’ సినిమాకు లీకుల బెడద మాత్రం తప్పేలా లేదు. షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన పోటోలు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన కూడా ఫోటోలు లీకవడం ఆశ్చర్యకరంగా మారింది.. తాజాగా ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ నుంచి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్లైమాక్స్ ఫైట్‌కు సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. ప్ర‌ముఖ న‌టుడు దేవ్ గిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఫైట్ కు సంబంధించిన ఫోటోలతో పాటు పవన్‌తో దిగిన ఫోటోను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఇది వైర‌ల్ అయింది.