ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త!

  • IndiaGlitz, [Thursday,January 16 2020]

ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త ఒకటి సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. సంక్రాంతి పండుగకు కొనసాగింపు అన్నట్టుగా.. తన 20వ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ను యంగ్ రెబల్ స్టార్ ఇవ్వనున్నాడని సమాచారం. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తాజా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. సాహో తర్వాత ఈ సినిమాకు సంబంధించిన వర్కులు నడుస్తున్నప్పటికీ.. అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు రాలేదు. అయితే శుక్రవారం ప్రభాస్ తన మౌనాన్ని వీడనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జాన్ అనే పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమాపై ఎలాంటి అప్ డేట్ రానుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఫ్యాన్స్‌లో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రభాస్ తన తాజా ప్రకటన చేయనున్నాడు.

ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు యూవీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. 1920ల నాటి కథాంశంగా చెబుతున్నారు. యూరప్‌లో జరిగే కథ అన్న ప్రచారం ఉంది. అయితే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతికవర్గంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More News

దీపిక స్టింగ్ ఆపరేషన్.. ఉలిక్కిపడ్డ అధికారులు!

స్టింగ్ ఆపరేషన్స్.. ఈ పేరు వింటే రాజకీయ నాయకులు ఉలిక్కిపడతారు. వీటిని పాత్రికేయలోకం ఎక్కువగా నిర్వహిస్తుంటుంది. సమాజంలో అవినీతిని వెలికి తీయడానికి..

పదేళ్ల కల నెరవేరింది.. కంగనా స్టూడియో రెడీ!

కంగనా రనౌత్.. పట్టుదలకు మారుపేరుగా.. బాలీవుడ్ క్వీన్‌గా తనకంటూ ప్రత్యేక సొంతం చేసుకున్న నటి. విభిన్న పాత్రలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. పట్టు పట్టిందంటే.. నెగ్గేవరకు వదలదన్నది ఆమెకున్న పేరు.

మిస్టర్ కూల్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ

మిస్టర్ కూల్ కు షాక్ ఇచ్చింది బీసీసీఐ. 2019-20 కాంట్రాక్ట్ జాబితాలో ధోనీకి అవకాశం ఇవ్వలేదు. దీంతో అభిమానులు మండిపడుతున్నారు.

రైతులారా బాబును నమ్మొద్దు... మీకు న్యాయం చేసేది జగనే : తలసాని

ఏపీ రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏలూరు లో కోడి పందేలను చూసేందుకు వెళ్ళిన ఆయన...

సామాజిక న్యాయం మాతోనే సాధ్యం : బీజేపీ - జనసేన

ఆంధ్ర ప్రదేశ్ కు బీజేపీ అవసరం చాలా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విజయవాడ లో బీజేపీ జనసేన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... మనస్ఫూర్తిగా బీజేపీ తో పొత్తు తో