close
Choose your channels

మందుబాబులకు గుడ్‌న్యూస్.. లాక్‌డౌన్‌లోనూ డోర్ డెలివరీ!

Thursday, April 9, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మందుబాబులకు గుడ్‌న్యూస్.. లాక్‌డౌన్‌లోనూ డోర్ డెలివరీ!

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో మద్యం ప్రియులు తెగ ఇబ్బంది పడుతున్నారు. దీంతో బార్‌లు తెరవండి లేదా హోమ్ డెలీవరి చేయాలనే డిమాండ్ యావత్ దేశ వ్యాప్తంగా పెరిగింది. మరోవైపు కల్లు, మద్యం దొరక్క చిత్రవిచిత్రాలుగా ప్రవర్తించడం, పిచ్చిపట్టి చాలా మంది ఆస్పత్రి పాలైన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో మందుబాబులకు మమత సర్కార్ (పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం) శుభవార్త తెలిపింది. మద్యాన్ని నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేయాలని సీఎం మమత బెనర్జీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా మూతబడిన మద్యం దుకాణాలను తెరవకుండా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకున్న వారికి షాపు ద్వారా డెలివరీ చేయనున్నారన్నదే ఆ నిర్ణయం సారాంశం.

అంతేకాదు.. ఇందుకోసం హోం డెలివరీ సమయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీస్ స్టేషన్ల నుంచి పాస్‌లు జారీ చేస్తామని.. వాటిని చూపించి షాపుకు మూడు డెలివరీ పాస్‌లు మాత్రమే ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఫోన్ల ద్వారా మద్యాన్ని ఆర్డర్ చేసుకుంటే సాయంత్రం ఐదు గంటలలోపు మద్యాన్ని డెలివరీ చేయనున్నట్టు ఎక్సైజ్ శాఖ తెలిపినట్లు వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి.

అదంతా అవాస్తవం..!

దీనిపై.. బెంగాల్ ప్రధాన కార్యదర్శి రాజీవా సిన్హా స్పందిస్తూ.. ఎక్సైజ్ శాఖపై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. మద్యం హోం డెలవరీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తేల్చిచెప్పారు.ఎక్సైజ్ శాఖ చెప్పినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కాగా.. ఇటీవలే స్వీట్ షాపులను పరిమిత సమయం అనుమతించినట్లుగానే మద్యం షాపులకు అనుమతులు ఇస్తారన్న చర్చ కూడా జోరందుకుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే దీదీ మీడియా ముందుకు రావాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.