గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్' ట్రైలర్ విడుదల

  • IndiaGlitz, [Friday,May 05 2017]

యాక్షన్ హీరో గోపీచంద్-సెన్సేషనల్ డైరెక్టర్ బి.గోపాల్ ల కాంబినేషన్ లో జయా బాలాజీ రియల్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న భారీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్" చిత్రం ట్రైలర్ ను నేడు (మే 5న) చిత్ర బృందం విడుదల చేసింది. తాండ్ర రమేష్ నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నయనతార కథానాయికగా నటించగా.. మణిశర్మ సంగీత సారధ్యం వహించారు.
ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ.. "ఇంద్ర, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాల అనంతరం బి.గోపాల్ నుంచి వస్తున్న మరో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్". ఈ చిత్రంలో గోపీచంద్ క్యారెక్టర్ ను బి.గోపాల్ మలిచిన తీరు.. నయనతార గ్లామర్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. అలాగే సినిమా కోసం స్విట్జర్లాండ్, పోర్చుగల్ లాంటి దేశాల్లో చిత్రీకరించిన పాటలు ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకొంటాయి. ప్రముఖ రచయితలు వక్కంతం వంశీ అందించిన కథ, అబ్బూరి రవి మాటలు సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయి. గోపీచంద్ కెరీర్ లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలుస్తుంది" అన్నారు.
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్, చలపతిరావ్, సలీం బేగ్, ఉత్తేజ్, జయప్రకాష్ రెడ్డి, ఫిరోజ్ అబ్బాసి, రమాప్రభ, సురేఖావాణి, సన, సంధ్యా జనక్, మధునందన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, ఫైట్స్: కనల్ కణ్ణన్, సినిమాటోగ్రఫీ: బాల మురుగన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర్రావు, ఆర్ట్: నారాయణ రెడ్డి, నిర్మాత: తాండ్ర రమేష్, దర్శకత్వం: బి.గోపాల్!

More News

అమితాబ్ సినిమాకి సిరాశ్రీ హిందీ పాట

దక్షిణాది నుంచి హిందీ సినిమాల్లో పనిచేసే నటులుంటారు,సంగీత దర్శకులు ఉంటారు,దర్శకులు ఉంటారు. కానీ గీతరచయితల గురించి ఎప్పుడైనా విన్నామా?

మే 6న శర్వానంద్ 'రాధ' ప్రీ రిలీజ్ ఫంక్షన్

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్ప్రెస్రాజా, శతమానం భవతి వంటి వరుస సూపర్డూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `రాధ`.

'బాహుబలి-2' షేర్ వివరాలివే...

తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి తెలియజేసిన విజువల్ వండర్ 'బాహుబలి 2'.

'ప్రాజెక్ట్ z' మే లో విడుదల

సందీప్ కిషన్, లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్ దర్శకత్వంలో తమిళ్లో తెరకెక్కిన 'మాయావన్' చిత్రాన్ని 'ప్రాజెక్ట్ z' గా ఎస్బికె ఫిలింస్ కార్పోరేషన్లో ఎస్.కె. బషీద్ సమర్పణలో నిర్మాత ఎస్.కె. కరీమున్నీసా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.

విలన్ గా శ్రియా శరన్...

హీరోయిన్స్ లో నెగటివ్ షేడ్స్ చేయగల హీరోయిన్స్ వేరయా అనే చందాన..