గోపీచంద్.. 45రోజులు అక్కడే
- IndiaGlitz, [Friday,January 18 2019]
తన 25వ సినిమా 'పంతం' తర్వాత గోపీచంద్ సినిమాల ఎంపిక విషయంలో అచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు తిరు దర్శకత్వంలో అనీల్ సుంకర నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ నెల 21 నుండి సినిమా ఫస్ట్ షెడ్యూల్లో రాజస్థాన్ జైపూర్లో ప్రారంభం కానుంది.
45 రోజుల పాటు జరగబోయే ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ పార్ట్ చిత్రీకరించబోతున్నారు. ఇద్దరు హీరోయిన్స్ నటించబోయే ఈ సినిమాలో ఎవరినీ హీరోయిన్స్గా తీసుకోవాలనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఈ సినిమా తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.