close
Choose your channels

మహా ‘పీఠం’ శివసేనదే.. ‘సీఎం’గా కూర్చునేదెవరో..!?

Monday, November 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మహా ‘పీఠం’ శివసేనదే.. ‘సీఎం’గా కూర్చునేదెవరో..!?

మహారాష్ట్ర సీఎం ‘పీఠం’పై చిక్కుముడులన్నీ వీడిపోయాయి. ఇప్పటి వరకూ బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని భావించినప్పటికీ.. చివరికి సీన్ రివర్స్ కావడంతో రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయి. 50:50 కి బీజేపీ అధిష్టానం ఒప్పుకోకపోవడంతో మిత్రపక్షం నుంచి శివసేనలు విడిపోయింది. ఈక్రమంలో బీజేపీ తమకు బలం లేదని సర్కార్‌ను ఏర్పాటు చేయలేమని గవర్నర్‌కు తేల్చిచెప్పింది. దీంతో శివసేన కాసింత చిక్కుల్లో పడినట్లైంది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితులు లేకపోవడంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌ సాయం కోరింది శివసేన. దీంతో ‘మహా'లో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్​కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. పరిస్థితులన్నీ చక్కబడటంతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన వీడిందని చెప్పుకోవచ్చు.

శివసేన-ఎన్సీపీ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతివ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిపై ఇంకా తుది ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మేరకు మద్దతు లేఖను ఫ్యాక్స్ ద్వారా రాజ్‌భవన్‌కు కాంగ్రెస్‌ పంపింది. సోమవారం మధ్యాహ్నం పార్టీ నేతలతో సుదీర్ఘ చర్చల తర్వాత ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌తో ఫోన్‌లో మాట్లాడిన సోనియాగాంధీ ఫలానా రూట్‌లో ముందుకెళ్లండని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం గవర్నర్‌ను కలిసేందుకు ఆదిత్య ఠాక్రే, ఎన్సీపీ నేతలు రాజ్‌భవన్‌ వెళ్లారు.

కాగా ప్రస్తుతం శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే గవర్నర్‌ను కలిసిన తర్వాత ఫలానా రోజున ప్రభుత్వ ఏర్పాటుకు రావాలని ఆయన ఆహ్వానిస్తారు. అనంతరం ప్రమాణ స్వీకారం ఉంటుంది. మరి సీఎం పీఠంపై శివసేన నుంచి ఆదిత్య కూర్చుంటారా..? లేకుంటే శరద్ పవార్ కూర్చుంటారా..? లేకుంటే కాంగ్రెస్ నుంచి ఎవరైనా కూర్చుంటారా..? అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు మంత్రి పదవుల పంపకంపై కూడా ఈ మూడు పార్టీల్లో అనే చిక్కుముడులు ఉన్నాయి. ఈ క్రమంలో మూడు పార్టీలు కలిసి ఎలా ముందుకెళ్తాయో.. ఎవర్ని పీఠంపై కూర్చుబెడతాయో అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.