close
Choose your channels

ఆర్టీసీ కార్మికుల విషయంపై ఫస్ట్ టైమ్ తమిళిసై స్పందన

Friday, October 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్టీసీ కార్మికుల విషయంపై ఫస్ట్ టైమ్ తమిళిసై స్పందన

తెలంగాణలో గత రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే కార్మికుల డిమాండ్‌కు సీఎం కేసీఆర్ అస్సలు ఒప్పుకోకపోవడం.. కార్మికులు కూడా సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పడంతో ప్రయాణికుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలో అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. అయితే ఈ వ్యవహారంపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పందించారు.

ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోండి!

‘ఇటు కార్మికులు, అటు ప్రభుత్వం పట్టువిడకపోవడంతో ప్రజా రవాణా మందగించింది. ఆర్టీసీ సమ్మెతో సామాన్యులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర యంత్రాంగం చూడాలి. సమ్మె కారణంగా సర్వీసులు నిలిచిపోయిన క్రమంలో ప్రత్యామ్నాయ చర్యలు రవాణా శాఖ కార్యదర్శి తీసుకోవాలి. సమ్మెపై పలు ఫిర్యాదులు అందాయి’ అని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఇప్పటికే పలుమార్లు ప్రతిపక్షనేతలు, ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు తమిళిసైను కలిసి ఫిర్యాదులు చేసిన విషయం విదితమే. కాగా ఇందుకు స్పందించిన రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ.. సమ్మెపై అన్ని చర్యలు తీసుకున్నామని.. సామాన్యులకు ఎలాంటి సమస్యలు ఎదురవకుండా చూస్తున్నామని గవర్నర్‌కు శర్మ నిశితంగా తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.