రేపటి నుండి 'గుంటూరోడు' సక్సెస్ టూర్..

  • IndiaGlitz, [Saturday,March 04 2017]

రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్ హీరోగా రూపొందిన ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ గుంటూరోడు చిత్రం మార్చి 3న విడుద‌లై మంచి ఆద‌ర‌ణ పొందుతోంది. బి, సి సెంట‌ర్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌స్తుందని నిర్మాత శ్రీ వ‌రుణ్ అట్లూరి తెలియ‌జేశాడు. క్లాప్స్‌ అండ్‌ విజిల్స్‌ బ్యానర్‌లో ఎస్‌.కె.సత్య దర్శకత్వంలో శ్రీ వరుణ్ అట్లూరి నిర్మించిన గుంటూరోడు సినిమా స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ స‌క్సెస్‌టూర్‌ను ఏర్పాటు చేసింది. మిర్చి సినిమాలో సంప‌త్‌గారి క్యారెక్ట‌ర్‌కు ఎంత మంచి పేరు వ‌చ్చిందో అంత‌కంటే మంచి పేరు గుంటూరోడు సినిమాలోని క్యారెక్ట‌ర్‌కు వ‌చ్చింది. దీనికి నంది అవార్డు, నేష‌న‌ల్ అవార్డు రావాల‌ని కోరుకుంటున్నానని నిర్మాత వ‌రుణ్ అట్లూరి అన్నారు.
మ‌నోజ్ పెర్ఫామెన్స్‌, సెంటిమెంట్స్‌, యాక్ష‌న్‌, కామెడికి మంచి రెస్పాన్స్ తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంద‌ని ద‌ర్శ‌కుడు స‌త్య తెలిపారు. డైరెక్ట‌ర్ స‌త్య నా క్యారెక్ట‌ర్‌ను ఫోన్‌లో చెప్ప‌గానే నాకు బాగా న‌చ్చింది. త‌ప్ప‌కుండా క్యారెక్ట‌ర్‌కు మంచి పేరు వ‌స్తుంద‌ని అప్పుడే చెప్పాను. అయితే మేం అంద‌రూ ఉహించిన దానికంటే మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌నోజ్ చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న హీరో. త‌న‌తో ఇంకా సినిమాలు చేయాల‌నుకుంటున్నానని సంప‌త్ అన్నారు.
క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌పై న‌మ్మ‌కంతో సినిమాను స్టార్ట్ చేశాం. మా న‌మ్మ‌కం ఈరోజు నిజ‌మైంది. ఇంత‌టి విజ‌యాన్ని అందించిన ప్రేక్ష‌కుల‌ను నేరుగా క‌లుసుకుని వారికి థాంక్స్ చెప్పాల‌నుకుని రేప‌టి నుండి సక్సెస్ టూర్‌ను ప్లాన్ చేస్తున్నాం. క‌రీంన‌గ‌ర్‌, క‌ర్నూల్‌, వ‌రంగ‌ల్‌, గుంటూరు, విజ‌య‌వాడ స‌హా అన్నీ ప్రాంతాల్లో తిరిగి ప్రేక్ష‌కుల‌ను క‌లుస్తానని హీరో మంచు మ‌నోజ్ చెప్పారు.

More News

మార్చి 10న ప్రపంప వ్యాప్తంగా సందీప్ కిషన్ 'నగరం'

యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా,రెజీనా కథానాయికగా అశ్వనికుమార్ సహదేవ్ సమర్పణలో

తమిళ హీరో, హీరోయిన్లకు గుబులు

సింగర్ సుచిత్ర చేసిన ఒకటి కాదని కోలీవుడ్ సినీ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఎందుకంటే సింగర్ సుచిత్ర సోషల్ మీడియా అకౌంట్ నుండి తమిళ సినీ వర్గానికి చెందిన ప్రముఖుల ప్రైవేట్ ఫోటోలు విడుదలైయ్యాయి.

టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్ ( 2015-16)

ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహింపబడే టి.ఎస్.ఆర్-టీవీ9 అవార్డ్స్ 2015-16 సంవత్సరానికిగానూ ఇవ్వనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, బెంగాళీ, మలయాళం, కన్నడ, పంజాబీ భాషల సినిమాలకు ఈ అవార్డులనిస్తారు.

ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్, రాజ్ తరుణ్ కాంబినేషన్ లో మరో సూపర్ హిట్

రాజ్ తరుణ్, అను ఇమ్మాన్యుయల్ జంటగా వంశీ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన `కిట్టు ఉన్నాడు జాగ్రత్త` మార్చి 3న విడుదలై సూపర్హిట్ టాక్ సొంతం చేసుకుంది. రాజ్ తరుణ్ తనదైన స్టయిల్లో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ను ఫుల్ ఎనర్జితో క్యారీ చేసిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

వర్మ హీరోతో ప్రభాస్ వార్...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి2 సినిమాతో ఈ ఏడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.