close
Choose your channels

గాడ్సేకు ఫ్యాన్ క్లబ్.. బీజేపీకి గుత్తాజ్వాల చురకలు! 

Saturday, May 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గాడ్సేకు ఫ్యాన్ క్లబ్.. బీజేపీకి గుత్తాజ్వాల చురకలు! 

మహాత్మా గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ నేతలు హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా.. సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి హెగ్డే, కర్ణాటక నేత నలిన్ కుమార్‌లు గాడ్సేను గాడ్‌లాగా భావిస్తూ ఓ రేంజ్‌లో ప్రశంసల వర్షం కురిపించారు. అయితే నేతలు చేసిన ఈ వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు సొంత పార్టీ నేతలే ఈ వ్యాఖ్యల పట్ల కన్నెర్రజేశారు. దీంతో ప్రజ్ఞా సింగ్ వెనక్కు తగ్గి క్షమాపణలు కోరారు. అయినప్పటికీ ఈ వివాదానికి ఇంకా ఫుల్‌స్టాప్ పడలేదు.

ఇప్పటికే ఈ వ్యవహారంపై పలువురు కాంగ్రెస్ నేతలు, విశ్లేషకులు, ప్రముఖులు సోషల్ మీడియా, టీవీ చానెల్స్ డిబెట్ల వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా.. బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ట్విట్టర్ వేదికగా స్పందించారు."గాంధీజీ హంతకుడైన గాడ్సేకు కూడా ఓ ఫ్యాన్ క్లబ్ ఉందని నాకు తెలియదు. బాపూను చంపడాన్ని ఇంకా కొందరు సమర్థించడం ఆశ్చర్యంగా ఉంది. దీన్నిబట్టి భవిష్యత్‌లో మన పిల్లలు మన దేశ చరిత్రనే నమ్మబోరు. ఈ పరిస్థితులు చూస్తే నాకు నిజంగానే భయం కలుగుతోంది" అని గుత్తా ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు అడ్డదిడ్డంగా వాదించగా వారిపై గుత్తా కౌంటర్ల వర్షం కురిపించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.