ప‌వ‌న్ 28...డిఫ‌రెంట్‌గా ప్లాన్ చేసిన హ‌రీశ్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రెండో చిత్రం ప్రారంభం కానుంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు (సెప్టెంబ‌ర్ 2) సంద‌ర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్ర‌టించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయాంక బోస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘ఈసారి కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్ర‌మే కాదు’ అనే క్యాప్ష‌న్ కూడా ఉంది. ఈ ప్రీ లుక్‌లో బైక్‌తో పాటు పెద్ద బాల‌శిక్ష కూడా ఉంది. గులాబీ పువ్వు కూడా ఉంది. బాల‌గంగాధ‌ర్ తిల‌క్‌, సుభాష్ చంద్ర‌బోస్ ఫొటోలు కూడా ఉన్నాయి.

గ‌బ్బ‌ర్‌సింగ్ వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ప‌దేళ్ల త‌ర్వాత రూపొందుతోన్న చిత్ర‌మిది. ప‌వ‌న్ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా న‌టింప చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇది వ‌ర‌కు హ‌రీశ్ శంక‌ర్ డైరెక్ట్ చేసిన డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ్‌, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రాల్లో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అదే ర్యాపోతో మ‌రోసారి పూజాను న‌టింప చేయ‌డానికి హ‌రీశ్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా మ‌హేశ్‌, అల్లు అర్జున్‌, చ‌ర‌ణ్ స‌హా వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టించారు. మ‌రిప్పుడు ప‌వ‌న్‌తో న‌టించ‌డానికి పూజాహెగ్డే ఒప్పుకుంటారో లేదో చూడాలి.

More News

‘ఆచార్య’ సినిమా క‌మిటీపై లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకోనున్న రాజేశ్‌

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య‌’. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తు్నారు.

‘వి’ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా జ‌స్టిఫికేష‌న్ ఉన్న పాత్ర చేయ‌డం చాలా హ్యాపీగా అనిపించింది : సుధీర్‌బాబు

హీరోగా, నిర్మాత‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నారు సుదీర్ బాబు. ‘స‌మ్మోహ‌నం’ త‌ర్వాత ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో

చిత్తూరు మృతుల కుటుంబాలకు ఎవరెవరు ఆర్థిక సాయం ప్రకటించారంటే..

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం దగ్గర పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా

చిత్తూరు మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిన రామ్ చరణ్

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం దగ్గర పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్ కడుతూ విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతి చెందిన విషయం తెలిసిందే.

పవన్‌ అభిమానులకు ఇండస్ట్రీ నుంచి సెకండ్ సర్‌ప్రైజ్..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే ఆయన అభిమానులకు ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ రూపంలో ఒక గిఫ్ట్ అందింది.