కొంతమంది ‘సినిమా’కు అవసరం : హరీష్


Send us your feedback to audioarticles@vaarta.com


కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధం చేస్తున్న తరుణంలో.. క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాలకు ఆపన్నహస్తంగా పలువురు ప్రముఖులు ఆర్థికంగా సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. ఏపీకి 50 లక్షల రూపాయిలు.. తెలంగాణకు 50 లక్షల రూపాయిలు.. అంటే రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయిలు విరాళంగా ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఈ డబ్బులను డొనేట్ చేస్తున్నట్లు ట్వి్ట్టర్ ద్వారా పవన్ కల్యాణ్ ప్రకటించారు.
అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోదీ రిలీఫ్ పండ్కు కోటి రూపాయిలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు పవన్ ప్రకటించారు. అంటే ఇప్పటి వరకూ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మొత్తంలో ఇచ్చిన హీరో పవన్ కల్యాణ్ ఒక్కరే కావడం విశేషమని చెప్పుకోవచ్చు. కాగా.. పవన్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని పెద్ద ఎత్తున చెప్పుకుంటూ.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరోవైపు.. పవన్ ప్రకటించిన సాయాన్ని పలువురు సినీ ప్రముఖులు కూడా మెచ్చుకుంటున్నారు.
సినిమాకు కొంతమంది అవసరం..
మరోవైపు.. దర్శకుడు హరీష్ శంకర్ కూడా పవన్ ట్వీట్కు రిప్లయ్ ఇచ్చాడు. ఇంత సాయం చేస్తున్నారు కదా ఇక సినిమాలెందుకని కొందరు అనుకుంటారేమో.. కొంతమందికి సినిమా అవసరం. కొంతమంది సినిమాకు అవసరం’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు పవన్ వీరాభిమానులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. మరికొందరు అభిమానులు.. ఇంతవరకూ పవన్ చేసిన ఆర్థిక విరాళాలను లిస్ట్ రూపంలో అభిమానులు పంచుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.