మ‌ణిశ‌ర్మ మ‌ళ్ళీ కాపీ కొట్టాడా?

  • IndiaGlitz, [Saturday,December 09 2017]

మెలోడీ పాట‌ల‌కు చిరునామాలా ఉండే సంగీత ద‌ర్శ‌కుల‌లో మ‌ణిశ‌ర్మ ఒక‌రు. అందుకే ఆయ‌న మెలోడీ బ్ర‌హ్మ అనిపించుకున్నారు. అయితే.. ఆ పాట‌ల్లో సొంత బాణీలు ఉన్న‌ట్టే.. కొన్ని కాపీ ట్యూన్స్ కూడా ఉన్నాయి. తాజాగా విడుద‌లైన ఓ పాట ఈ విష‌యాన్ని మ‌రోసారి నిరూపించింది. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. అల్లు శిరీష్‌, సుర‌భి జంట‌గా ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఫేమ్ వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క క్ష‌ణం అనే పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాకి మ‌ణిశ‌ర్మ సంగీతమందిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం టీజ‌ర్‌ కోసం మ‌ణి అందించిన నేప‌థ్య సంగీతంకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక శుక్ర‌వారం సాయంత్రం ఈ సినిమాకి సంబంధించి ఓ సింగిల్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. సో మెనీ సో మెనీ అంటూ సాగే ఈ పాట‌ని వింటే.. అటుఇటుగా ఏడాది క్రితం విడుద‌లై యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన షేప్ ఆఫ్ యు అనే పాట గుర్తుకి రాక‌మాన‌దు.

లిరిక్స్ ని మిన‌హాయిస్తే.. మిగ‌తాదంతా సేమ్ టు సేమ్‌. మ‌ణి ఈ పాట‌ని కాపీ కొట్టారో లేక‌పోతే ఇన్‌స్పైర్ అయి ఇచ్చారో కానీ.. ఈ పాట‌పై విమ‌ర్శ‌లు మాత్రం బాగానే ఉన్నాయి.

More News

డిసెంబ‌ర్ 28న విడుద‌ల కానున్న అల్లు శిరీష్, వి.ఐ.ఆనంద్, 'ఒక్క క్షణం'

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి జంట‌గా, డిమానిటైజేష‌ల్ లో కూడా బ్లాక్‌బ‌స్టర్ గా నిలిచిన‌ ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో.... సినిమా నిర్మించడంలో ఎక్క‌డా ఎలాంటి కాంప్ర‌మైజ్ కాకుండా క్వాలిటీ క

ఫిబ్రవరి 9న విడుదలవుతున్న నిఖిల్ 'కిర్రాక్ పార్టీ'

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ సినిమా "కిరిక్ పార్టీ"ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ తెలుగులో 'కిర్రాక్ పార్టీ'గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న 'ఇ ఈ'

నీరజ్‌ శ్యామ్‌, నైరా షా జంటగా నటించిన చిత్రం 'ఇ ఈ'. రామ్ గణపతిరావు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. నవబాల క్రియేషన్స్ పతాకంపై లక్ష్మమ్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ చేతన్ టీఆర్ స్వరాలందించారు.

'రంగ‌స్థ‌లం' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై రూపొందిన భారీ చిత్రం 'రంగ‌స్థ‌లం'. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌) నిర్మాత‌లు ఈ ప్రెస్టీజియ‌స్ చిత్రాన్ని నిర్మించారు.

ప్రభాస్ కి పాడాలని ఉందట‌

బాలీవుడ్ టాలెంటెడ్ సింగర్ అర్మాన్ మాలిక్. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, ఉర్దూ భాషల్లో కూడా పాటలు పాడారు.